మహబూబ్‌నగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సిఎం చెప్పారు, కానీ తప్పుకోను!:మ.నగర్‌పై విజయలక్మి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Mahabubnagar Map
మహబూబ్ నగర్: తాను మహబూబ్ నగర్ నియోజకవర్గంలో పోటీ నుండి తప్పుకోవడం లేదని దివంగత రాజేశ్వర రెడ్డి సతీమణి విజయలక్ష్మి శనివారం స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో శుక్రవారం సాయంత్రం విజయలక్ష్మి భేటీ అయిందని ఆ తర్వాత ఆమె పోటీ నుండి వెనక్కి తగ్గిందని వార్తలు వచ్చాయి. వీటిపై ఆమె స్పందించారు. ముఖ్యమంత్రితో తాను భేటీ అయిన విషయం వాస్తవమేనని చెప్పారు. మహబూబ్ నగర్ నియోజకవర్గం అభ్యర్థిని మార్చే పరిస్థితి లేదని కిరణ్ నాకు చెప్పారని, పార్టీలో తనకు సముచిత స్థానం కల్పిస్తానని హామీ ఇచ్చారని అన్నారు. కానీ ఏం ఇస్తారో చెప్పలేదన్నారు. తనకు సిఎం కార్యాలయం నుండి పిలుపు వస్తే బిఫారం కోసమే అనుకున్నానని చెప్పారు. అయితే తాను తప్పుకుంటున్నట్లు ఎవరికీ చెప్పలేదన్నారు. ఇప్పటి వరకు తప్పుకునే ఆలోచన లేదని తన కార్యకర్తలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని ఆమె చెప్పారు.

కాగా అంతకుముందు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బుజ్జగింపులతో దివంగత రాజేశ్వర రెడ్డి సతీమణి విజయలక్ష్మి ఉప ఎన్నికల బరిలో నుండి తప్పుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్లుగా వార్తలు వచ్చాయి. ఆమె శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రిని కలిశారని, టిక్కెట్ కేటాయించనప్పటికీ పార్టీలో సముచిత న్యాయం కల్పిస్తామని ఆమెకు హామీ సిఎం ఇచ్చారు. ఆయన హామీ కారణంగానే విజయలక్ష్మి పోటీ నుండి తప్పుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ ఉప ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ అభ్యర్థి ముత్యాల ప్రకాశ్‌కు మద్దతిచ్చేందుకు ఆమె అంగీకరించారు. మహబూబ్ నగర్ సంక్షోభం చల్లారడంతో కాంగ్రెసు పార్టీ ఇక ఉప ఎన్నికల గెలుపుపై దృష్టి సారించింది.

English summary
Late Rajeshwar Reddy wife Vijayalaxmi said that she is ready to contest from Mahabubnagar. She condemned withdraw comments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X