మంత్రి సారయ్య కొడుకు అరెస్టుకు రంగం సిద్ధం
కార్యక్రమం ముగిసిన తర్వాత సారయ్య కుమారుడు శ్రీమాన్ పోలీసు స్టేషన్కు వెళ్లి వీరంగం సృష్టించారు. ఎస్సై రమేష్పై తిట్ల వర్షం కురిపించారు. దీంతో రమేష్ శ్రీమాన్పై రాతపూర్వకమైన ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు శ్రీమాన్పై కేసు నమోదు చేశారు. అరెస్టు చేసేందుకు కూడా పోలీసులు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది.
మహీధర్ రెడ్డితో పాటు బీసీ సంక్షేమ శాఖ మంతి బస్వరాజు సారయ్య కాన్వాయ్ కాజీపేటకు చేరుకున్న సమయంలో ఆదివారంనాడు స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాజీపేట మేయిన్ రోడ్డులోని మినీ మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందుకు చేరగానే పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్ నేతృత్వంలో పలువురు తెరాస నాయకులు మంత్రుల కాన్వాయ్ను అడ్డగించారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
కాన్వాయ్కు అడ్డంతిరుగుతున్న వారిని అక్కడి నుంచి తొలగించడానికి ప్రయత్నించారు. వారి నుంచి తప్పించుకున్న ఎమ్మెల్యే వినయ్, టీఆర్ఎస్ నాయకులు జై తెలంగాణ నినాదాలతో ముం దుకు దూసుకెళ్ళారు. కాగా, మంత్రి మహీధర్రెడ్డి తన వాహనం నుంచి కిందికి దిగాల్సి వచ్చింది.
కాజీపేటలో పేరుకుపోయిన సమస్యలను స్వయంగా పరిశీలించాలని ఎమ్మెల్యే వినయ్ మంత్రిని కోరారు. మంత్రి బస్వరాజు సారయ్య, ఎంపీ సిరిసిల్ల రాజయ్య అక్కడికి చేరుకుని పరిస్థితిని వినయ్తో మాట్లాడారు. సమస్యలను పరిశీలించాల్సిందేనని పట్టుబట్టడంతో మంత్రి మహీధర్రెడ్డి సానుకూలంగా స్పందించి మినీ మునిసిపల్ కార్యాలయంలోకి వెళ్ళారు.
తన కుమారుడు ఏ తప్పూ చేయలేదని మంత్రి బస్వరాజు సారయ్య అన్నారు. తాను తెలంగాణ కోసం పోరాడుతున్నందు వల్లనే తనపై కుట్ర చేసి తన కుమారుడిని కేసుల్లో ఇరికించారని ఆయన ఆరోపిచారు. చట్టానికి ఎవరూ అతీతులు కారని ఆయన అన్నారు.