తాగి పోలీసులకు చిక్కిన మంత్రి విశ్వరూప్ తనయుడు

పోలీసులు శుక్రవారం రాత్రి ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పట్టుబడినవారిలో విశ్వరూప్ కుమారుడు కూడా ఉన్నారు. పోలీసులు అతను నడుపుతున్న బిఎండబ్ల్యూ కారును స్వాధీనం చేసుకుని, అతన్ని వేరే కారులో ఇంటికి పంపించేశారు. మంగళవారంనాడు కోర్టుకు హాజరు కావాలని పోలీసులు అతన్ని ఆదేశించారు. అతనికి 2500 రూపాయల జరిమానా కూడా వేశారు.
కృష్ణారెడ్డి నడిపిన ఎపి9 సీసీ 117 నెంబర్ కారును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు ఇన్స్పెక్టర్ బాలకృష్ణారెడ్డి ధ్రువీకరించారు. మంగళవారంనాడు కృష్ణా రెడ్డి కోర్టుకు హాజరవుతారని, ఆ సమయంలో కృష్ణారెడ్డికి కౌన్సెలింగ్ నిర్వహిస్తామని ఆయన చెప్పారు. కృష్ణారెడ్డిపై కేసు నమోదు చేశామని ఆయన చెప్పారు. వివరాలు సేకరించి కృష్ణారెడ్డిని ఇంటికి పంపించినట్లు ఆయన తెలిపారు.
కాగా, తమకు వ్యక్తిగతంగా ఎవరిపై కక్ష లేదని పోలీసు ఉన్నతాధికారి సివి ఆనంద్ చెప్పారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తే ఊరుకునేది లేదని ఆయన అన్నారు. మంత్రి కుమారుడికి కౌన్సెలింగ్ నిర్వహిస్తామని ఆయన చెప్పారు. తాగి డ్రైవింగ్ చేయకూడదనే చైతన్యం నగర ప్రజల్లో పెరుగుతోందని, ఇది సంతోషకరమైన పరిణామమని ఆయన అన్నారు.
-
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!!












Click it and Unblock the Notifications