హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తాగి పోలీసులకు చిక్కిన మంత్రి విశ్వరూప్ తనయుడు

By Pratap
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: మద్యం సేవించిన తర్వాత కారు నడుపుతూ మంత్రి విశ్వరూప్ కుమారుడు కృష్ణారెడ్డి శుక్రవారం రాత్రి ట్రాఫిక్ పోలీసులకు చిక్కారు. ఆయనపై బంజారాహిల్స్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కింద కేసు నమోదు చేశారు. హైదరాబాదులోని బంజారాహిల్స్ సమీపంలోని కెబిఆర్ పార్కు వద్ద కృష్ణా రెడ్డిని పోలీసులు పట్టుకున్నారు. అతను తాగి కారు నడుపుతున్నట్లు తేల్చుకున్న పోలీసులు కారును స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు శుక్రవారం రాత్రి ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పట్టుబడినవారిలో విశ్వరూప్ కుమారుడు కూడా ఉన్నారు. పోలీసులు అతను నడుపుతున్న బిఎండబ్ల్యూ కారును స్వాధీనం చేసుకుని, అతన్ని వేరే కారులో ఇంటికి పంపించేశారు. మంగళవారంనాడు కోర్టుకు హాజరు కావాలని పోలీసులు అతన్ని ఆదేశించారు. అతనికి 2500 రూపాయల జరిమానా కూడా వేశారు.

కృష్ణారెడ్డి నడిపిన ఎపి9 సీసీ 117 నెంబర్ కారును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు ఇన్‌స్పెక్టర్ బాలకృష్ణారెడ్డి ధ్రువీకరించారు. మంగళవారంనాడు కృష్ణా రెడ్డి కోర్టుకు హాజరవుతారని, ఆ సమయంలో కృష్ణారెడ్డికి కౌన్సెలింగ్ నిర్వహిస్తామని ఆయన చెప్పారు. కృష్ణారెడ్డిపై కేసు నమోదు చేశామని ఆయన చెప్పారు. వివరాలు సేకరించి కృష్ణారెడ్డిని ఇంటికి పంపించినట్లు ఆయన తెలిపారు.

కాగా, తమకు వ్యక్తిగతంగా ఎవరిపై కక్ష లేదని పోలీసు ఉన్నతాధికారి సివి ఆనంద్ చెప్పారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తే ఊరుకునేది లేదని ఆయన అన్నారు. మంత్రి కుమారుడికి కౌన్సెలింగ్ నిర్వహిస్తామని ఆయన చెప్పారు. తాగి డ్రైవింగ్ చేయకూడదనే చైతన్యం నగర ప్రజల్లో పెరుగుతోందని, ఇది సంతోషకరమైన పరిణామమని ఆయన అన్నారు.

English summary
Drunk and drive case was booked against minister Viswaroop's son Krishna Reddy by Traffic police. Krishna Reddy will attend the court on tuesday. Police officer CV Anand confirmed the case against Krishna Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X