హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాఘవ విడుదలలో జాప్యం: జగన్ కూల్.. ధర్మాన డల్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Vijaya Raghava
హైదరాబాద్: ఎమ్మార్ కేసులో అరెస్టైన నిందితుడు విజయ రాఘవకు రెండు రోజుల క్రితం సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆయనను విడుదల చేయడంలో జాప్యం ఏర్పడింది. విజయ రాఘవకు కోర్టు సోమవారం షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. కానీ, ఆ బెయిలు పత్రాలు జైలు అధికారులకు మంగళవారం సాయంత్రం అందాయి. దీంతో ఆయన బుధవారానికి వాయిదా పడింది.

మరోవైపు విజయ రాఘవ బెయిల్‌ను 4 రోజులు నిలిపివేయాలని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) చేసిన అభ్యర్థనను నాంపల్లి సిబిఐ కోర్టు తోసిపుచ్చింది. విజయ రాఘవకు నాంపల్లి ప్రత్యేక కోర్టు సోమవారం రూ.50వేల చొప్పున ఇద్దరి పూచీకత్తుపై బెయిల్‌ను మంజూరు చేసింది. సిబిఐ విజయ రాఘవను జనవరి 28న ఈ కేసుకు సంబంధించి అరెస్టు చేసింది. ఎమ్మార్ విల్లాల డాక్యుమెంట్లు తారుమారు చేశాడని ఇతనిపై ఆరోపణలు ఉన్నాయి.

కాగా మంగళవారం కోర్టు మెట్లెక్కిన మంత్రి ధర్మాన ప్రసాద రావు డల్‌గా ఉండగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం కూల్ గా ఉన్నారు. కేబినెట్ మాజీ సహచరుడు మోపిదేవి పక్కనే నిలబడ్డా ధర్మాన అన్యమనస్కంగానే పలకరించారు. జగన్ తానే చొరవ చేసి కరచాలనం చేసినా పెద్ద స్పందన చూపలేదు. అదే సమయంలో మోపిదేవి, జగన్ మాత్రం ఆసాంతం హుషారుగా కనిపించారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత రెహ్మాన్ కోర్టు ప్రాంగణంలో సిబిఐ పైన విరుచుకు పడ్డారు. బెడ్ షీట్ల మాదిరిగా సిబిఐ ఛార్జీషీట్ల మీద ఛార్జీషీట్లు వేస్తూ పోతోందని మండిపడ్డారు. మాజీ మంత్రి మోపిదేవి అనుచరులు కూడా కాసేపు హంగామా సృష్టించిన విషయం తెలిసిందే.

English summary
Release of Vijaya Raghava, accused in EMAAR case, is delay due to bail papers did not reach Chanchalguda till Tuesday evening.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X