మళ్లీ సకల జనుల సమ్మె: టిఎన్జీవోల హెచ్చరిక

కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే తెలంగాణ మార్చ్ ప్రశాంతంగా జరిగిందని హర్షం వ్యక్తం చేస్తే, రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాత్రం విధ్వంసం సృష్టించారని ఆనడం పట్ల వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆఖరికి డిజిపి దినేష్ రెడ్డి సైతం కేసులు లేవని చెబుతుంటే, హోం మంత్రి మాత్రం కేసులు ఉన్నాయని చెబుతున్నారని వారు ఆరోపించారు.
టిఎన్జీవోలపై కేసులు పెట్టడం సరికాదని, తెలంగాణ కోసం కృషి చేస్తున్నవారిపై పెట్టిన కేసులను ఎత్తివేసే బాధ్యత తెలంగాణ మంత్రులపైనే ఉన్నదని తెలంగాణ ఎన్జీవో నాయకులు శ్రీనివాస్ గౌడ్, దేవీ ప్రసాద్, రవీందర్ రెడ్డి అన్నారు. టి. మార్చ్ ప్రశాంతంగా జరిగిందని గుర్తు చేస్తూ విధ్వంసం జరిగితే చూస్తూ ఊరుకోమని హోంమంత్రి వ్యాఖ్యానించడాన్ని వారు ఖండించారు.
తెలంగాణ మార్చ్ సందర్భంగా పోలీసులు ఆందోళనకారులపై కేసులు నమోదు చేశారు. కేసులు నమోదైనవారిలో తెలంగాణ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కూడా ఉన్నారు. తెలంగాణ మార్చ్ సందర్భంగా మొత్తం 39 కేసులు నమోదు చేసినట్లు హైదరాబాద్ పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ చెప్పారు.
నమోదైన కేసుల వివరాలను ఆయన హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డికి చెప్పారు. వీడియో ఫుటేజ్ ఆధారంగా హింసకు పాల్పడినవారిని గుర్తిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రత్యేక దర్యాప్తు బృందం ద్వారా కేసుల విచారణ జరుగుతుందని ఆయన చెప్పారు.
-
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
అద్దె పోయి వాటా వచ్చింది. సింగిల్ స్క్రీన్స్లో మల్టీప్లెక్స్ రూల్స్ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం












Click it and Unblock the Notifications