7న మళ్లీ సైకిల్ ఎక్కనున్న మాజీ ఎంపి చాడ

స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ సదస్సులు నిర్వహిస్తోంది. మాజీలను పార్టీలో చేర్చుకోవడానికి ఈ ప్రాంతీయ సదస్సులను వేదికలుగా మార్చుకుంది. ఇందులో భాగంగా ఈ నెల 7వ తేదీన వరంగల్లో జరిగే ప్రాంతీయ సదస్సులో చాడ సురేష్ రెడ్డితో పాటు ఆప్కో మాజీ చైర్మన్ మండల శ్రీరాములు తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశాలున్నాయి.
చాడా సురేష్ రెడ్డి, మండల శ్రీరాములు ఇప్పటికే వరంగల్ జిల్లాకు చెందిన సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావుతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఆదివారం జరిగే ప్రాంతీయ సదస్సులో చంద్రబాబు సమక్షంలో వారు తిరిగి పార్టీలో చేరే అవకాశం ఉంది. గతంలో ఈ ఇద్దరు నాయకులు కూడా తెలుగుదేశం పార్టీలో ఏ వెలుగు వెలిగారు.
సురేష్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఇటీవలే పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. దాంతో ఆయన తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై తీవ్ర విమర్శలు చేశారు. అప్పటి నుంచి ఏ పార్టీలో చేరాలనే విషయంపై మల్లగుల్లాలు పడుతూ వచ్చారు. చాడ సురేష్ రెడ్డిని చేర్చుకోవడానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు కూడా ముమ్మరంగా ప్రయత్నాలు సాగించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ ఆయన తిరిగి సొంతగూటికి చేరేందుకే సిద్ధపడినట్లు అర్థమవుతోంది. గతంలో రెండు సార్లు హన్మకొండ నుంచి తెలుగుదేశం తరఫున పోటీ చేసి పార్లమెంటు సభ్యుడిగా గెలిచారు.
-
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications