బీజేపీ వైపు రమేశ్ రాథొడ్ చూపు..? హస్తం వీడి కమలదళంలో చేరే ఛాన్స్...?
ఆదిలాబాద్ కాంగ్రెస్ మాజీ ఎంపీ రాథోడ్ బీజేపీ వైపు చూస్తున్నారు. పార్టీ మార్పు అంశానికి సంబంధించి గత కొన్ని రోజుల నుంచి అనుచరులు, అభిమానులతో మాట్లాడుతున్నారు. చివరకు బీజేపీలో చేరాలని రమేష్ రాథోడ్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రమేష్ రాథోడ్ బీజేపీలో చేరితే కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ అని అందరూ భావిస్తోండగా.. కాంగ్రెస్ పార్టీతోపాటు రాజకీయ వర్గాల్లో దీనిపై తీవ్ర చర్చ జరుగుతోంది.
అనుచరులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు రమేశ్ రాథొడ్. వారి అభిప్రాయాలకు అనుగుణంగా పార్టీ మారాలనే యోచనలో ఆయన ఉన్నారు. 1999 - 2004 మధ్యకాలంలో ఎమ్మల్యేగా విజయం సాధించారు. 2006 నుండి 2009 వరకు ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్గా రమేశ్ రాథొడ్ పనిచేశారు. 2009లో 15వ లోక్ సభకు పోటీచేసి ఎంపీగా విజయం సాధించారు.

నాగార్జున సాగర్ ఉపఎన్నికకు ముందే.. రమేష్ రాథోడ్ను పార్టీలో చేర్చుకుని ఉపఎన్నికలో పావులు కదపాలని బీజేపీ భావిస్తోంది. లంబాడి, ఆదివాసీలకు దగ్గర వ్యక్తి కావడంతో రమేష్ రాథోడ్ చేరికను ఆ పార్టీ వర్గాలు కూడా స్వాగతిస్తున్నాయి. రమేష్ రాథోడ్తోపాటు పాల్వాయి హరీష్ కూడా బీజేపీ ఆకర్ష్ మంత్రంలో భాగాంగా కమలం గూటికి చేరే అవకాశం ఉంది. లంబాడి వర్గానికి చెందిన రమేష్ రాథోడ్.. సిర్పూర్ కాగజ్ నగర్లో బలంగా ఉన్న పాల్వాయి హరీష్ తమ పార్టీలో చేరితే నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో మరింత బలపడవచ్చునని బీజేపీ భావిస్తోంది.
-
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !!












Click it and Unblock the Notifications