పెళ్ళై నాలుగు నెలలే, పెళ్లి కూతురు మృతి, కారణమదేనా?
పెళ్ళై నాలుగు మాసాలే. కాని, కొత్త పెళ్ళి కూతురు అనుమానాస్పద స్థితిలో మరణించింది. అయితే తమ కూతురు మరణానికి అత్తింటివారే కారణమని మృతురాలి కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు.
గూడూరు: పెళ్ళై నాలుగు మాసాలే. కాని, కొత్త పెళ్ళి కూతురు అనుమానాస్పద స్థితిలో మరణించింది. అయితే తమ కూతురు మరణానికి అత్తింటివారే కారణమని మృతురాలి కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు అత్తింటివారిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంల నార్తురాజుపాలెం గ్రామానికి చెందిన అమరావతి,శ్రీనివాసులు దంపతులకు ముగ్గురు కుమార్తెలు. అయితే శ్రీనివాసులు కొంత కాలం క్రితం చనిపోయాడు. శ్రీనివాస్ పెద్ద కుమార్తె సౌమ్య అలియాస్ వర్షితను కలువాయి మండలం కుల్లూరు గ్రామానికి చెందిన కృష్ణ అలియాస్ వెంకటకృష్ణకు ఇచ్చి గత ఏడాది డిసెంబర్ 4వ, తేదిన వివాహం చేశారు.

పెళ్ళి సమయంలోనే భారీగా కట్నకానుకలు సమర్పించారు.కొత్త దంపతులు గూడూరు పట్టణంలోని తూర్పు వీధిలో కాపురం ఉంటున్నారు.అయితే కొంత కాలం పాటు ఈ దంపతుల కాపురం సజావుగానే సాగింది.కాని, అదనపు కట్నం తేవాలంటూ సౌమ్యను అత్తింటివారు వేధించారని మృతురాలి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
ఈ వవిషయమై పుట్టింటికి వెళ్ళిన సౌమ్య నాలుగు రోజుల క్రితమే అత్తింటికి వచ్చింది.అయితే భార్య, భర్లల మద్య ఏం జరిగిందో తెలియదు. గురువారం ఉదయం ఆమె చనిపోయిందని సౌమ్య కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు అత్తింటివారు.
అయితే తమ కూతురును హత్య చేసి ఆత్మహత్య చేసుకొందని కట్టుకథలు అల్లుతున్నారని సౌమ్య కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.సౌమ్య తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు సౌమ్య భర్త వెంకటకృష్ణను, తల్లి బుజ్జమ్మను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.
-
కిల్లర్ మిల్లర్.. గాయాన్ని సైతం లెక్కచేయని మొండిధైర్యం -
ఈ రాశి వారికి ఆస్తి తగాదాలు తప్పవు..!! -
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
కుప్పకూలిన Gold ETF.. 18 ఏళ్లలో అతిపెద్ద పతనం.. -
తన భార్య గురించి విజయ్ సంచలన కామెంట్స్. 30 ఏళ్లు ఎదురుచూసి! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
Humsafar Express: శ్రీకాకుళం-తిరుపతి కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్-ఆ రోజు నుంచే..! -
సెకెనుకు 40,000 కి. మీ వేగంతో.. భూమి వైపు -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
ఏపీలో ఈ నియోజకవర్గాలు ఇక మహిళలకే, సీనియర్లు.. మంత్రుల స్థానాలు ఔట్..!! -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
అది ఇస్త్రీ కొట్టా ? సాఫ్ట్ వేర్ కంపెనీనా ?? .. అకౌంట్ లో రూ.598 కోట్లు !!












Click it and Unblock the Notifications