కాపు నేత ముద్రగడతో అంబటి రాంబాబు భేటీ: ఎందుకు?
కాకినాడ: కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభాన్ని తూర్పుగోదావరి జిల్లాలోని కిర్లంపూడిలోని ఆయన స్వగృహంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు అంబటి రాంబాబు భేటీ అయ్యారు. ఈ నెలాఖరున జిల్లాలో వైసిపి అధినేత వైయస్ జగన్ బహిరంగ సభ నిర్వహించ తలపెట్టడంతో ఈ భేటీకి ప్రాధాన్యం చేకూరింది.
అంబటి రాంబాబు ముద్రగడతో మంతనాలు జరపడం రాజకీయంగా ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. చంద్రబాబు వ్యతిరేక శక్తుల ఏకీకరణపై వైయస్సార్ కాంగ్రెసు దృష్టి సారించిందని సమాచారం. ఇటీవలి కాలంలో కాపు నాయకులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని తీవ్రంగా విమర్శిస్తున్నారు.

చంద్రబాబుపై ముద్రగడ కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి ముద్రగడ పద్మనాభాన్ని ఆహ్వానించడానికి అంబటి రాంబాబు మంతనాలు జరుపుతున్నట్లు కూడా చెబుతున్నారు. ఇటీవలి ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలుగుదేశం, బిజెపి కూటమికి మద్దతు పలకడంతో కాపుల ఓట్లు కూడా పడి ఆ కూటమి గెలిచిందని భావిస్తున్నారు.
ప్రస్తుత వాతావరణంలో పవన్ కళ్యాణ్ మౌనంగా ఉండడం ఇతర కాపు నేతలు చంద్రబాబుపై పోరుకు సిద్ధం కావడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకమైన మలుపునకు దారి తీస్తాయా అనే ఆలోచన సాగుతోంది. కాపు సామాజిక వర్గంలో ముద్రగడ పద్మనాభానికి మంచి పేరుంది. దీంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆయనను తమ వైపు లాక్కునే ప్రయత్నాలు సాగిస్తున్నట్లు చెబుతున్నారు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications