మాటల యుద్ధం: ఖబడ్దార్ :కాల్వ, టీవీల్లో చూస్తున్నారు: జగన్
హైదరాబాద్: రైతుల రుణమాఫీపై సోమవారం ఆంధ్రప్రదేశ్ శానససభలో ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. శాసనసభలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యులు రౌడీల్లో ప్రవర్తిస్తున్నారని టిడిపి ఎమ్మేల్యే కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. బయట రౌడీల్లా ప్రవర్తించినా సభలో ఆ విధంగా ప్రవర్తిస్తే కుదరదని అంటూ వారిని ఖబడ్డార్ అని హెచ్చరించారు.
కాగా, రుణమాఫీపై మాట్లాడే అర్హత వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి లేదని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. రైతులు, ప్రజలు తమను అర్థం చేసుకున్నారని ఆయన అన్నారు. రుణమాఫీపై ప్రతిపక్ష నేత వైయస్ జగన్ తీవ్రంగా ధ్వజమెత్తారు. ప్రభుత్వం మాటలకు, చేతలకు పొంతనలేదని ఆయన అన్నారు. ప్రభుత్వం రుణమాఫీకి కేటాయించిన నిధులు వడ్డీకి సరిపోవని ఆయన అన్నారు. రుణమాఫీ అన్నది ఇప్పటికీ ప్రభుత్వం స్పష్టం చేయలేదని ఆయన అన్నారు. రైతు రుణాల మాఫీ చేస్తామని చంద్రబాబు తొలి సంతకం చేశారని, అసలెంత.. వడ్డీ ఎంత మాఫీ చేస్తున్నారని ఆయన అన్నారు.

అసెంబ్లీలో ఏం జరుగుతోందో ప్రజలు టీవీల్లో చూస్తున్నారని ఆయన అన్నారు. వ్యవస్థలన్నీ కుప్పకూలే పరిస్థితి వచ్చిందని ఆయన అన్నారు. రైతులకు రుణమాఫీ చేస్తున్నారా, వారిని రుణగ్రస్థులను చేస్తున్నారా అని జగన్ అడిగారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై అవగాహనతోనే రైతుల రుణమాఫీకి హామీ ఇచ్చామని టిడిపి చెప్పిందని ఆయన గుర్తు చేశారు. కుటుంబానికి ఒక్క రుణం మాత్రమే మాఫీ చేస్తామని అప్పుడు చెప్పలేదని ఆయన అన్నారు. రైతుల రుణమాఫీ జరగలేదు, కొత్త రుణాలు రావడం లేదని ఆయన అన్నారు. చంద్రబాబు వడ్డీలేని రుణాల పథకాన్ని తీసేస్తున్నారా అని ఆయన అడిగారు. వడ్డీకి కూడా సరిపోని రుణమాఫీతో వ్యవసాయాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని ఆయన అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రుణమాఫీపై మాట తప్పారని జగన్ విమర్శించారు. శాసనసభలో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. రైతులు, డ్వాక్రా మహిళల రుణాలను మాఫీ చేస్తానని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారని గుర్తుచేశారు. రుణమాఫీపై తొలి సంతకం చేస్తానని అప్పట్లో చెప్పిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక రుణమాఫీపై నిబంధనల పేరిట కోత పెట్టారని విమర్శించారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్, గరిష్ట రుణమాఫీ పరిమితి పేరిట రైతులను మోసం చేశారని వైఎస్ జగన్ ఆరోపించారు.
-
AP Pensions: ఆ పెన్షన్లు తీసేశాం-తేల్చేసిన సర్కార్ ..! -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!!












Click it and Unblock the Notifications