ఛాంబర్లు చెరిసగం: కోడెల, మధుసూదనాచారి(పిక్చర్స్)
హైదరాబాద్: కొత్త అసెంబ్లీలోని మంత్రుల ఛాంబర్లను ఇరు రాష్ట్రాలు చెరో సగం వినియోగించుకుంటాయని ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాద్ అన్నారు. శుక్రవారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్పీకర్ల సమావేశంలో పార్టీలకు కార్యాలయాల కేటాయింపుపై చర్చ జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ శాసనమండి ఛైర్మన్ స్వామిగౌడ్, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ ఎస్. రాజా సదారామ్, ఆంధ్ర అసెంబ్లీ కార్యదర్శి (ఇన్ఛార్జీ) కె. సత్యనారాయణ రావు తదితరులు పాల్గొన్నారు.
పాత అసెంబ్లీ భవనంలోని తెలంగాణ డిప్యూటీ స్పీకర్ ఛాంబర్ మినహా మిగతావన్నీ ఖాళీ చేసేందుకు తెలంగాణ శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి అంగీకరించారు. గవర్నర్, తెలంగాణ స్పీకర్ ఇచ్చిన సూచనల పట్ల సానుకూలంగా స్పందించామని మీడియాకు ఏపి స్పీకర్ కోడెల శివప్రసాద రావు తెలియజేశారు.
టి, ఏపి స్పీకర్లు
కొత్త అసెంబ్లీలోని మంత్రుల ఛాంబర్లను ఇరు రాష్ట్రాలు చెరో సగం వినియోగించుకుంటాయని ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాద్ అన్నారు.
టి, ఏపి స్పీకర్లు
శుక్రవారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్పీకర్ల సమావేశంలో పార్టీలకు కార్యాలయాల కేటాయింపుపై చర్చ జరిగింది.
టి, ఏపి స్పీకర్లు
పాత అసెంబ్లీ భవనంలోని తెలంగాణ డిప్యూటీ స్పీకర్ ఛాంబర్ మినహా మిగతావన్నీ ఖాళీ చేసేందుకు తెలంగాణ శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి అంగీకరించారు.
టి, ఏపీ స్పీకర్లు
ఈ సమావేశంలో తెలంగాణ శాసనమండి ఛైర్మన్ స్వామిగౌడ్, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ ఎస్. రాజా సదారామ్, ఆంధ్ర అసెంబ్లీ కార్యదర్శి (ఇన్ఛార్జీ) కె. సత్యనారాయణ రావు తదితరులు పాల్గొన్నారు.
టి, ఏపి స్పీకర్లు
గవర్నర్, తెలంగాణ స్పీకర్ ఇచ్చిన సూచనల పట్ల సానుకూలంగా స్పందించామని మీడియాకు ఏపి స్పీకర్ కోడెల శివప్రసాద రావు తెలియజేశారు.
టి, ఏపి స్పీకర్లు
ఆర్సీ బిల్డింగ్ మొత్తం తెలంగాణ కేటాయించినట్లు చెప్పారు. అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్లో రెండు ఫ్లోర్లు తెలంగాణకు, మరో రెండు ఫ్లోర్లు ఏపీకి కేటాయించేందుకు ఒప్పందం కుదిరిందని స్పీకర్ కోడెల తెలిపారు.
ఆర్సీ బిల్డింగ్ మొత్తం తెలంగాణ కేటాయించినట్లు చెప్పారు. అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్లో రెండు ఫ్లోర్లు తెలంగాణకు, మరో రెండు ఫ్లోర్లు ఏపీకి కేటాయించేందుకు ఒప్పందం కుదిరిందని స్పీకర్ కోడెల తెలిపారు. అయితే ఏయే అధికారులకు ఏ ఛాంబర్లు కేటాయించాలన్న అంశం కొలిక్కి రాలేదు.
ప్రస్తుతం ఆంధ్ర అసెంబ్లీ కార్యదర్శి (ఇన్ఛార్జీ) కె. సత్యనారాయణ రావుకు ఉన్న ఛాంబర్ను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కేటాయించాలని, తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి సదారామ్ ఛాంబర్ను ఆంధ్ర అసెంబ్లీ ఉప సభాపతి మండలి బుద్ద ప్రసాద్కు కేటాయించాలని నిర్ణయించారు. అయితే తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శికి ప్రత్యామ్నాయంగా ఛాంబర్ను చూపించలేదు.