రైలు ముందు నిల్చొని సెల్ఫీ: బీటెక్ విద్యార్ధి ప్రాణం తీసింది
అమరావతి: తమ స్మార్ట్ఫోన్లలో సెల్ఫీలు తీసి వాటిని సోషల్ మీడియా వెబ్ సైట్లలో పోస్ట్ చేసి లైకులు సాధించాలనుకునే వారికి ఇదొక గుణపాఠం. కర్నూలులో సెల్ఫీ మోజు ఓ విద్యార్ధి ప్రాణాన్ని బలిగొంది. వేగంగా వస్తున్న రైలు ముందు నిల్చొని సెల్ఫీ వీడియో తీసుకుంటున్న ఇంజనీరింగ్ విద్యార్ధిని రైలు ఢీకొట్టిన ఘటన కర్నూలు జిల్లా పాణ్యం మండలం నెరవాడ సమీపంలో జరిగింది.
బుధవారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వివారాలిలా ఉన్నాయి. పట్టాలపై నిలబడి వెనుక నుంచి వేగంగా వస్తున్న రైలు ముందు సెల్ఫీ వీడియో దిగేందుకు ప్రయత్నించిన బీటెక్ విద్యార్ధిని రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు మండలానికి చెందిన ఇద్రూస్ బాషా (20)గా గుర్తించారు.

నెరవాడలోని ఆర్సీఎం ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. రోజూ ఉదయం వాకింగ్కు వెళ్లి, రైల్వే ట్రాక్ సమీపంలో సెల్ఫీలు దిగడం ఇతగాడి హాబీ. విద్యార్ధి మృతిపై సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications