మూటలు మోసినవారి కోసమే బెజవాడ: బాబుపై బొత్స
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీకి మూటలు మోసినవారి కోసమే విజయవాడను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాత్కాలిక రాజధానిగా చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు నాయకుడు బొత్స సత్యనారాయణ విమర్శించారు. శివరామకృష్ణన్ కమిటీ నివేదిక రాకుండా తాత్కాలిక రాజధానిగా విజయవాడను ప్రకటించడం అర్థరహితమని ఆయన అన్నారు.
నివేదిక వచ్చిన తర్వాత అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఏపీ రాజధానిపై నిర్ణయం తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పుడు ఉంటున్నదే తాత్కాలిక రాజధాని అని, మరో తాత్కాలిక రాజధాని అవసరం లేదని చెప్పారు. దీని వల్ల ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అవుతాయని, ప్రాంతీయ విభేదాలు తలెత్తే అవకాశం ఉందని ఆయన అన్నారు.

ఎన్నికల్లో లబ్ది చేకూర్చిన వారి గురించి ఆలోచించకుండా ప్రజాశ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని రాజధానిపై నిర్ణయం తీసుకోవాలని బొత్స డిమాండ్ చేశారు. శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ఈ నెలాఖరులోనే రాబోతున్నప్పుడు ఇప్పుడు హడావుడిగా తాత్కాలిక రాజధానిని ప్రకటించడంలోని ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరావు సర్వజనసర్వే నిర్వహించడాన్ని ఆయన సమర్థిస్తూ, సంక్షేమ కార్యక్రమాలు అందరికో క్రిందిస్థాయి వరకూ వెళ్లాలని ఆయన అభిప్రాయపడ్డారు. సర్వేల పేరుతో తెలుగువారికి అన్యాయం జరిగితే తాము సహించబోమని ఆయన అన్నారు.
-
ఏపీలో విషాదం : రాత్రంతా ఆన్ లోనే బైక్ ఇంజన్.. పొగ పీల్చి నలుగురు మృతి! -
‘ఆ తప్పు వల్లే ప్రెగ్నెన్సీ.. తప్పక పెళ్లి చేసుకున్నా’ -
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో అల్లు అర్జున్ కుమార్తె..!












Click it and Unblock the Notifications