Botsa Satyanarayana: బ్రెయిన్ స్ట్రోక్ వార్తలపై స్పందించిన బొత్స..!
ఏపీలో విపక్ష వైఎస్సార్సీపీ సీనియర్ నేత, ప్రస్తుత శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ (botsa satyanarayana) నిన్న ఉన్నట్లుండి హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని, అందుకే హుటాహుటిన హైదరాబాద్ కు తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారని ఇవాళ ప్రచారం జరిగింది. దీనిపై స్వయంగా ఆయనే ఆస్పత్రి నుంచి క్లారిటీ ఇచ్చారు. దీంతో ఆయన అనారోగ్యంపై అభిమానుల్లో నెలకున్న ఆందోళనకు చెక్ పడింది.
తాను ఆరోగ్యంగానే ఉన్నట్లు ఇవాళ హైదరాబాద్ నుంచి బొత్స సత్యనారాయణ ఓ ప్రకటన చేశారు. రొటీన్ చెకప్లో భాగంగానే ఆస్పత్రికి వెళ్లినట్లు ఆయన వెల్లడించారు. తన ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా తెలిపారు. దీంతో ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినట్లు జరుగుతున్న ప్రచారం ఒట్టిదేనని తేలిపోయింది. రొటీన్ చెకప్ తర్వాత బొత్స రేపోమాపో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఏపీ శాసనమండలిలో అధికార కూటమి సభ్యులకూ, వైఎస్సార్సీపీ సభ్యులకు మధ్య వాడీవేడీ చర్చలు జరుగుతున్నాయి. అటు అసెంబ్లీకి వైఎస్సార్సీపీ రాకపోవడంతో మండలిలో చర్చలే అసెంబ్లీ తరహాలో వాడీవేడిగా మారాయి. ఇందులో కొద్ది రోజులుగా పాల్గొంటూ చురుగ్గా వ్యవహరిస్తున్న విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఇవాళ హఠాత్తుగా కనిపించకపోవడం, అస్వస్థతతో ఆస్పత్రిపాలయ్యారని తెలియడంతో ఆయన అభిమానులు, రాజకీయ నాయకులు ఫోన్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
-
అమ్మకు భరోసా.. మూడు దశాబ్దాల ప్రస్థానంలో భారత్ విజయగాథ -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ!












Click it and Unblock the Notifications