వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏం చేయాలో నాకు తెలుసు: పవన్‌కు బాబు కౌంటర్! కేవీపీ, వైసీపీలకు కూడా

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల తన పైన, తమ ప్రభుత్వం పైన విమర్శలు చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్, కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్ర రావు, వైసీపీలకు బుధవారం నాడు కౌంటర్ ఇచ్చారు.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల తన పైన, తమ ప్రభుత్వం పైన విమర్శలు చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్, కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్ర రావు, వైసీపీలకు బుధవారం నాడు కౌంటర్ ఇచ్చారు.

చంద్రబాబు వెళ్లే మార్గంలో 200 జిలెటిన్ స్టిక్స్, నిర్ఘాంతపోయిన అధికారులుచంద్రబాబు వెళ్లే మార్గంలో 200 జిలెటిన్ స్టిక్స్, నిర్ఘాంతపోయిన అధికారులు

ప్రత్యేక ప్యాకేజీ, పోలవరం, అభివృద్ధి పైన కేవీపీ, పవన్, వైసిపి నేతలు టిడిపిపై భగ్గుమన్నారు. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లాలో చంద్రబాబు వారికి సమాధానం ఇచ్చారు.

ఇటీవల పవన్ ఓ సభలో మాట్లాడుతూ అన్ని రకాలుగా లోపాలున్న ప్రత్యేక ప్యాకేజీని ఎందుకు అంగీకరించారని చంద్రబాబును ప్రశ్నించారు. ఏపీకి రావల్సిన వాటాను కవర్ కప్పి మనకు ఇచ్చిన దానిని ఏ రకంగా చంద్రబాబు మెచ్చుకున్నారని నిలదీశారు.

chandrababu naidu

పవన్ వ్యాఖ్యలపై చంద్రబాబు పరోక్షంగా ఈ రోజు కౌంటర్ ఇచ్చారు. ఇటీవల కాలంలో చాలా మంది ప్రత్యేక హోదా కావాలన్నారని, ఈ జిల్లాలో కూడా సభలు పెట్టి చెప్పారని, తనను కూడా విమర్శించారని, కానీ తాను కూడా విజ్ఞతతో ఆలోచించానని, తనకు అనుభవం ఉందని, ఎప్పుడు ఏం చేయాలో తనకు తెలుసునని, తనను విమర్శించేవారికి అనుభవం లేదని, తాను కూడా కేంద్రంతో గొడవ పెట్టుకోవచ్చునని, అది నిముషం పని కాదని, కానీ గొడవల వల్ల ప్రయోజనం లేదని కౌంటర్ ఇచ్చారు.

బాబుకు కడప తర్వాతే కుప్పం!: ఎన్ని కుట్రలు చేసినా.. కడపలో జగన్‌కు ఇలా చెక్బాబుకు కడప తర్వాతే కుప్పం!: ఎన్ని కుట్రలు చేసినా.. కడపలో జగన్‌కు ఇలా చెక్

పోలవరం ప్రాజెక్టులో టిడిపి లేదా చంద్రబాబు పాత్ర ఏం లేదని కేవీపీ నిన్న అన్నారు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ.. పోలవరం ప్రాజెక్టు జాతీయహోదా కాకుండా నాబార్డు ద్వారా మొదటి విడుత 1980 కోట్లు తీసుకోచ్చామంటే అది తన విజ్ఞత వల్లేనన్నారు.

వైసీపీ నేత శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ పట్టిసీమకు, పోలవరానికి తాము వ్యతిరేకం కాదని, కానీ టీడీపీకి ప్రాజెక్టుల పైన చిత్తశుద్ది లేదన్నారు. దీనిపై చంద్రబాబు మాట్లాడుతూ... చాలామంది తనను, పట్టిసీమను వ్యతిరేకించారన్నారు.

ఆ కారణంతోనే జగన్‌లో ఆందోళన, అందుకే వస్తున్నారు: భూమా నాగిరెడ్డిఆ కారణంతోనే జగన్‌లో ఆందోళన, అందుకే వస్తున్నారు: భూమా నాగిరెడ్డి

నిన్న జరిగిన సభలో జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడితే ఆయనను కూడా వైసీపీ నేతలు విమర్శించారన్నారు. పోలవరం వచ్చే లోపల పట్టిసీమ పూర్తి చేయకపోయింటే అనంతపురానికి తాగడానికి కూడా నీళ్లు వచ్చేవి కాదన్నారు. అలాగే, తనకు అనుభవం ఉందని, తనను విమర్శించే వారికి అనుభవం లేదని జగన్‌ను ఉద్దేశించి కూడా చంద్రబాబు వ్యాఖ్యానించారని చెప్పవచ్చు.

English summary
AP CM Chandrababu Naidu counter to Pawan Kalyan, KVP Ramachandra Rao and YSRCP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X