ఏపీలో 20 లక్షల ఉద్యోగాల కల్పనకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశం!
పది సూత్రాలు స్వర్ణాంధ్ర సాధనకు కీలకమని ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడించారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు ప్రాధాన్యత అంశాలను గురించి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయా శాఖల నోడల్ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కీలక విషయాలను వెల్లడించారు. స్పీడ్ అఫ్ డెలివరీ గవర్నెన్స్ లో భాగంగా పౌరులకు మెరుగైన సేవలు వేగంగా అందించేందుకు ప్రతి ప్రభుత్వ శాఖ ఇండికేటర్ లను సిద్ధం చేసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు.
పది సూత్రాలను పది మిషన్ లుగా పని చెయ్యాలి: చంద్రబాబు
స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాల సాధన కోసం రూపొందించిన పది సూత్రాలను పది మిషన్ లుగా నిర్దేశించుకుని పనిచేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. జీరో పావర్టీ మిషన్ల భాగంగా P4 విధానాన్ని ముందుకు తీసుకువెళ్లాలని, విజన్ మానిటరింగ్ యూనిట్ల ద్వారా అమలును పర్యవేక్షించాలని సీఎం చంద్రబాబు సూచించారు. ప్రతి కుటుంబం సాధికారత సాధించాలని, వ్యక్తులకు ఆర్థిక భద్రత కల్పించడం ఈ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశమని చంద్రబాబు అన్నారు.

మొదటి ప్రాధాన్యత ఉద్యోగాల కల్పనకే
ప్రభుత్వం చేపట్టే వివిధ సంక్షేమ పథకాల అమలుతో రాష్ట్రంలో ఉన్న దాదాపు 30 లక్షల బిపిఎల్ కుటుంబాలకు ఎంత ప్రయోజనం చేకూరిందో అంచనా వెయ్యాలని చంద్రబాబు సూచించారు. ఇక పాపులేషన్ మేనేజ్మెంట్ కు సంబంధించి ఒక విధానాన్ని రూపొందించాలంటూ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఏపీలో మొట్టమొదటి ప్రాధాన్యతగా ఉద్యోగాల కల్పనను తీసుకోవాలని 20 లక్షల ఉద్యోగాలను కల్పించడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు.
10 సూత్రాల అంశాలు ప్రజల్లోకి వెళ్ళాలి
నైపుణ్యం పోర్టల్ ద్వారా ఈ వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో ఉంచాలని చంద్రబాబు సూచించారు. 10 సూత్రాలకు సంబంధించిన అంశాలు ప్రజలలోకి విస్తృతంగా వెళ్లాలని, ఆ దిశగా పక్క ప్రణాళికతో పని చేయాలన్నారు. నీటి వనరుల సమర్థ వినియోగంతో పాటు నీటి ఆడిట్ నిర్వహించాలన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు సస్యశ్యామలంగా ఉండాలన్నదే తన ఆకాంక్ష అని చంద్రబాబు పేర్కొన్నారు. టెక్నాలజీ వినియోగంతో సాగు వ్యయం తగ్గేలా చూడాలన్నారు.
రవాణా వ్యయం తగ్గించేలా లాజిస్టిక్స్ రంగంపై దృష్టి
డిమాండ్ ఆధారిత పంటల ఉత్పత్తి, కోల్డ్ చైన్ ఫుడ్ ప్రాసెసింగ్ లాంటి అంశాల పైన దృష్టి పెట్టాలని, రైతులకు మేలు కలిగేలా చూడాలన్నారు. రాష్ట్రంలో రవాణా వ్యయాన్ని తగ్గించేలా లాజిస్టిక్స్ రంగాన్ని తీర్చిదిద్దాలన్నారు. రోడ్లు, రైలు, అంతర్గత జల రవాణా, సి కార్గో, ఎయిర్ కార్గో లాంటి అంశాలతో పాటు గోల్డ్ చైన్ లాంటి మౌలిక సదుపాయాల కల్పనకు లాజిస్టిక్స్ మాస్టర్ ప్లాన్ రూపొందించాలని చంద్రబాబు సూచించారు.
ఆంధ్రా బ్రాండ్ ను ప్రపంచ వ్యాప్తం చెయ్యాలి
విద్యుత్తు, ఇంధన వ్యయాలు తగ్గించడానికి దృష్టి సారించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రెసిడెన్షియల్ హాస్టళ్లలో ఆర్గానిక్ కూరగాయల ఉత్పత్తి చేయాలని ఆలోచన చేస్తున్నట్టు సీఎం వెల్లడించారు. ఆంధ్ర బ్రాండ్ ను ప్రపంచవ్యాప్తం చేసేలా స్పష్టమైన విధానం ఉండాలని చంద్రబాబు అన్నారు.
-
AP Govt: ఇక రాష్ట్రమంతా సంజీవని..! చంద్రబాబు కీలక ఆదేశాలు..! -
అమరావతి బిల్లు పాస్ కాగానే లోకేష్ చేసిందిదే..! చంద్రబాబు రియాక్షన్..! -
ఏపీలోని 13 కార్పోరేషన్లలో డివిజన్ల పెంపు-విజయవాడ, గుంటూరు సహా ఇవే..! -
టీడీపీ ఎమ్మెల్యే తీరుపై చంద్రబాబు సీరియస్-తక్షణం..! -
ఒంటిమిట్ట కోదండ రామస్వామి కల్యాణం.. పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు -
LPG: ఏపీలో వ్యాపారులకు ఊరట- కమర్షియల్ గ్యాస్ పై సర్కార్ ఉత్తర్వులు..! -
పార్లమెంట్ లో అమరావతి బిల్లు వేళ చంద్రబాబు, జగన్ ఎత్తుకు పైఎత్తులు..! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..! -
పేద, మధ్యతరగతి ప్రజలకు బిగ్ షాక్.. ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్ !! -
ఇంటర్ మూల్యాంకనం పూర్తి, ఫలితాల డేట్ ఫిక్స్ - ఏపీ.. తెలంగాణలో ఇలా..!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్












Click it and Unblock the Notifications