వికారుద్దీన్ను దేవుడే శిక్షించాడు: కానిస్టేబుల్ భార్య
చిత్తూరు: ఉగ్రవాది వికారుద్దీన్ను ఆ దేవుడే శిక్షించాడని మహిళా కానిస్టేబుల్గా పని చేస్తున్న శాంతమ్మ అన్నారు. 2010లో తన భర్త రమేష్ హైదరాబాదులో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న సమయంలో వికారుద్దీన్ తుపాకీతో కాల్చి చంపాడని ఆవేదన వ్యక్తం చేశారు.
తన భర్తను అకారణంగా చంపిన ఉగ్రవాది వికారుద్దీన్కు దేవుడే తగిన శిక్ష వేశాడన్నారు. ఇలాంటి ఉగ్రవాదనలు కాల్చి చంపడం సబబే అన్నారు. చిత్తూరు జిల్లాలోని రామసముద్రానికి చెందిన యు రమేష్ కడప ఏపీఎస్పీ 11వ బెటాలియన్ కానిస్టేబుల్గా హైదరాబాద్లో పని చేసేవారు.

2010 మే 14న రమేశ్ను వికారుద్దీన్ కాల్చి చంపేశాడు. ప్రస్తుతం రామసముద్రం స్టేషన్లో కానిస్టేబుల్గా పని చేస్తున్న శాంతమ్మ వికారుద్దీన్ ఎన్కౌంటర్ గురించి తెలుసుకుని ఆనందం వ్యక్తం చేశారు. ఆమె బంధువులు, స్నేహితులకు మిఠాయిలు పంచి పెట్టారు.
వికారుద్దీన్ మృతితో తన బిడ్డ ఆత్మకు శాంతి చేకూరుతుందని హోంగార్డు బాలస్వామి తల్లి అన్నారు. 2009లో హైదరాబాదులో ఫలక్ నుమా వద్ద ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో విధుల్లో ఉన్న మహబూబ్ నగర్ జిల్లా గంగాపురం గ్రామానికి చెందిన హోంగార్డు బాలస్వామి మృతి చెందారు. ఇప్పుడు వికారుద్దీన్ మృతిపై బాలస్వామి తల్లి బాలమ్మ పైవిధంగా స్పందించారు.
-
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!












Click it and Unblock the Notifications