చంద్రబాబుపై అవకాశం: అలా చేస్తే జగన్ సెల్ఫ్గోల్, టిడిపికి ఆయుధం
ఏపీ శాసనసభ, శాసనమండలి సమావేశాలు నవంబరు 10వ తేదీ నుంచి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 10 రోజులు సభ జరుగుతుంది.
అమరావతి: ఏపీ శాసనసభ, శాసనమండలి సమావేశాలు నవంబరు 10వ తేదీ నుంచి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 10 రోజులు సభ జరుగుతుంది.
Recommended Video

మధ్యలో వచ్చే సెలవులు కూడా కలిపితే నవంబరు నాలుగో వారం వరకు సమావేశాలు కొనసాగుతాయి. బడ్జెట్ సమావేశాలు మార్చిలో జరగ్గా మే 16న జీఎస్టీ బిల్లు ఆమోదం కోసం శాసనసభను ప్రత్యేకంగా సమావేశపరిచారు.

సమావేశాలు బహిష్కరించే యోచన
ఏపీ శాసన సభ సమావేశాలు వచ్చే నెలలో నిర్వహించడంపై వైసిపి విమర్శలు చేస్తోంది. అంతేకాదు నవంబర్ 2న లేదా 6వ తేదీ నుంచి వైసిపి అధినేత వైయస్ జగన్ పాదయాత్ర ప్రారంభం కానుంది. జగన్ పాదయాత్ర సమయంలో ఉద్దేశ్యపూర్వకంగా సమావేశాలు నిర్వహిస్తున్నారని, ఈ నేపథ్యంలో సమావేశాలు బహిష్కరించాలని వైసిపి భావిస్తోంది.

సమావేశాలు బహిష్కరిస్తే సెల్ఫ్ గోల్
సమావేశాలను బహిష్కరించే అంశాన్ని వైసిఎల్పీ భేటీలో ఈ నెల 26న నిర్ణయం తీసుకోనున్నారు. జగన్ అందరి అభిప్రాయాలు తీసుకుంటారు. అయితే సమావేశాలను బహిష్కరిస్తే అది సెల్ఫ్ గోల్ అవుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి.

హాజరయితే అవకాశం
వైసిపి చెప్పినట్లుగా జగన్ పాదయాత్రను చూసుకొని అధికార పార్టీ సమావేశాలు నిర్వహిస్తుండవచ్చు. అధికార పార్టీ కుట్ర చేసినా, జగన్ లేకపోయినా ప్రజా సమస్యలపై చర్చించాలనే చిత్తశుద్ధితో తాము హాజరవుతున్నామని చెప్పేందుకు ఆస్కారం ఉంటుందని, బహిష్కరిస్తే అది వైసిపికే నష్టమని అంటున్నారు. పార్టీ మారిన వారిపై చర్యలు తీసుకుంటారా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే సభా సాక్షిగా లేవనెత్తే ఆస్కారం ఉంది.

అలా చేస్తే వ్యతిరేక సంకేతాలు
సమావేశాలను బహిష్కరిస్తే.. కేవలం జగన్ పాదయాత్ర కోసమే వైసిపి ఇలా చేసిందని టిడిపి నేతలు విమర్శించేందుకు ఆస్కారం దొరకడమే కాకుండా, ప్రజల్లోకి కూడా వ్యతిరేక సంకేతాలు వెళ్తాయని వైసిపిలో కొందరు భావిస్తున్నారట. కాబట్టి బహిష్కరించకపోవడమే ఉత్తమం అని కొందరు అభిప్రాయపడినట్లుగా తెలుస్తోంది.

అధికార పార్టీకి ఆయుధం ఇచ్చినట్లే
ఇప్పటికే నంద్యాల ఉప ఎన్నికలు, కాకినాడ మున్సిపల్ ఎన్నికలతో వైసిపి కేడర్ కొంత డీలాపడింది. పాదయాత్ర కోసం జగన్కు కోర్టు నుంచి మినహాయింపు వస్తుందని భావించారు. సిబిఐ కోర్టులో చుక్కెదురయింది. వీటికి తోడు సమావేశాలను బహిష్కరిస్తే.. అధికార పార్టీకి ఓ ఆయుధం ఇచ్చినట్లుగా అవుతుందని భావిస్తున్నారట.

అలా చేస్తేనే మంచిది
సమావేశాలకు హాజరు కాకుండా ఉంటే అధికార పార్టీ ఏకపక్షంగా నిర్వహించుకునేందుకు అవకాశముంటుందని అంటున్నారు. బహిష్కరించకుండా సమావేశాలకు హాజరై ప్రజా సమస్యలపై అధికార పార్టీని నిలదీసినా, అప్పడు బహిష్కరించినా ప్రజల్లోకి మంచి సంకేతాలు వెళ్తాయని భావిస్తున్నారు.
-
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం!












Click it and Unblock the Notifications