అమరావతిలో 'స్టార్టప్' అభివృద్ధి, 20 ఏళ్ల సమయం: లక్షల ఉద్యోగాలు
విజయవాడ: నవ్యాంధ్ర రాజధాని అమరావతిని ప్రపంచస్థాయిలో తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తున్నారు. అమరావతి తొలి ఫేజ్ నిర్మాణానికి పదిహేనేళ్లు పట్టనుందని చెబుతున్నారు. మాస్టర్ ప్లాన్ డెవలప్మెంట్ కోసం సీఆర్డీఏ ఎంపిక ప్రక్రియను ప్రారంభించింది.
సీడ్ కేపిటల్లో స్టార్టప్ కోసం 6.84 చ.కి.మీ. ప్రాంతం కేటాయిస్తున్నారు. ఇది రాజధాని నగరానికే పైలట్ ప్రాజెక్టు వంటిది. దానిని దృష్టిలో పెట్టుకొనే సింగపూర్ కన్సార్టియం స్విస్ ఛాలెంజ్ ప్రతిపాదనను అందజేసిందని సీఆర్డీఏ చెబుతోంది. స్టార్టప్ భాగం ఎక్కువగా కృష్ణా నది ఒడ్డునే ఉంటుంది.

ఈ కారణంగానే నదీ తీరాన్ని అనుకొని ఉన్న 1691 ఎకరాలను స్టార్టప్ ప్రాంతంగా ఎంపిక చేశారు. ఇక్కడ నివసించే వారికి అన్ని సౌకర్యాలు అత్యుత్తమంగా ఉంటాయి. ఈ ప్రాంతం పూర్తిగా అభివృద్ధి చేందే నాటికి లక్షకు పైగా కుటుంబాలు నివసిస్తాయని, రెండున్నర లక్షల ఉద్యోగాలు వస్తాయని అంచనా వేస్తున్నారు.
దీనిని మూడు దశల్లో అభివృద్ధి చేస్తారు. నదికి అభిముఖంగా ఉంటుంది. నదీ తీరం, ఆహ్లాద వాతావరణం ఉన్న నేపథ్యంలో ఇక్కడి స్థలానికి ఎక్కువ డిమాండ్ తీసుకు రావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కాబట్టి దీని అభివృద్ధికి 20 ఏళ్ల సమయం పెట్టుకున్నారు. మొదటి దశలో అబివృద్ధి చేసిన స్థలాల్లో డెబ్బై శాతం అమ్ముడు అయితే రెండో దశ ప్రాజెక్టు పైన దృష్టి సారించనున్నారు.
-
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !! -
జగన్ కు 'మావిగన్' సలహా ఆయనదే, అసలు టార్గెట్..!! -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త! -
ఏపీ, తెలంగాణాను కలిపే ఆ జాతీయ రహదారిపై 15 రోజులపాటు నో టోల్ ఫీ -
సాయిరెడ్డి తాజా సంకేతాలు, తెర వెనుక..!? -
కర్ణాటకలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన నారా లోకేష్..! -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం












Click it and Unblock the Notifications