జగన్తో ఎలాంటి సంబంధం లేదు, బినామీనీ కాదు: తేల్చేసిన సునీల్
వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని ప్రైవేట్ బస్ ఓనర్స్, ఆపరేటర్స్ అసోసియేషన్ నేత సునీల్ స్పష్టం చేశారు. తాను జగన్కు బినామీ కూడా కాదని తేల్చి చెప్పారు.ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు.
అమరావతి: తనకు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని ప్రైవేట్ బస్ ఓనర్స్, ఆపరేటర్స్ అసోసియేషన్ నేత సునీల్ స్పష్టం చేశారు. తాను జగన్కు బినామీ కూడా కాదని తేల్చి చెప్పారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుపై హైకోర్టుకు వెళ్తామని సునీల్ అన్నారు. ట్రావెల్స్ రిజిస్ట్రేషన్లపై తప్పుడు ప్రచారం జరుగుతోందని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకునే అవకాశం లేకపోవడంతో ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నామని ఆయన తెలిపారు.

తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ట్రావెల్స్పై చట్ట వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నాయని సునీల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు లోబడే తాము బస్సులు నడుపుతున్నామని తెలిపారు.
ఓ వ్యక్తి ఒత్తిడికి ప్రభుత్వాలు తలొగ్గాయని ఆరోపించిన ఆయన.. ఆ వ్యక్తి పేరు చెప్పకపోవడం గమనార్హం. కాగా, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో చర్చలకు తాము సిద్ధమని తెలిపారు.
-
AP Pensions: ఆ పెన్షన్లు తీసేశాం-తేల్చేసిన సర్కార్ ..! -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!!












Click it and Unblock the Notifications