అలిపిరి వద్ద 500గదులతో వసతి గృహం: టీటీడీ కీలక నిర్ణయాలివే
తిరుపతి: మంగళవారం జరిగిన తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలకమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టీటీడీ ఉద్యోగులకు పరకామణి విధులు వేయకూడదని, మూడేళ్లు దాటి తిరుమలలో పనిచేస్తున్నవారిని తిరుపతికి బదిలీ చేయాలని నిర్ణయించారు.
టీటీడీ ఉద్యోగులు ఆగస్టు మాసంలో కొన్ని సమస్యలు పరిష్కరించాలని టీటీడీ పాలక మండలికి సమ్మె నోటీసు ఇచ్చారు. ఈ నేపథ్యంలో టీటీడీ ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్, ఈవో అనిల్ సింఘాల్ వారి సమస్యలపై ఉద్యోగులతో చర్చించి, పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

500గదులతో వసతి గృహం
అలిపిరి వద్ద భక్తుల సౌకర్యార్థం మొదటి దశలో రూ.120కోట్లతో దాదాపు 500 గదులతో వసతి సముదాయం నిర్మించేందుకు ఆమోదం తెలిపారు.
తిరుమలలోని వసతి గృహాల ఆధునీకరణ, ఇతర మౌలిక సౌకర్యాల కల్పనకు టీటీడీ బోర్డు ఎఫ్ఎంఎస్ సబ్ కమిటీ చేసిన సిఫార్సులను ఆమోదించింది. ఇందుకు రూ.112కోట్లు ఖర్చు చేయనుంది. టీటీడీలోని రెగ్యూలర్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వృత్తిపరంగా ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు కమిటీ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.

కళాశాలల్లో సీట్ల పెంపు
టీటీడీ విద్యాసంస్థల్లోని బోధనా సిబ్బందికి పదవీ విరమణ లేదా మరణించిన సందర్భాలలో ఆర్జిత సెలవు(ఎర్న్డ్ లీవ్), అర్థ వేతన సెలవుల నగదు మార్పిడికి సంబంధించిన జీవో నెం. 90అమలు చేసేందుకు నిర్ణయించారు. టీటీడీ ఆధ్వర్యంలోని జూనియర్, డిగ్రీ కళాశాలల్లో ఆదరణ ఎక్కువగా ఉన్న గ్రూపులలో సీట్ల సంఖ్యను పెంచేందుకు, ఆదరణ తక్కువగా ఉన్న గ్రూపుల్లో సీట్ల సంఖ్యను తగ్గించేందుకు ఆమోదం తెలిపారు.

పరకామణి డిప్యూటేషన్ విధులు రద్దు
టీటీడీ సిబ్బంది విజ్ఞప్తి మేరకు వారికి పరకామణి డిప్యూటేషన్ విధులను రద్దు చేసేందుకు ఆమోదం తెలిపారు. ఫారిన్ సర్వీసు నుంచి టీటీడీకి వచ్చిన ఉద్యోగులను 3సంవత్సరాల కాలపరిమితి అయిన తర్వాత మాతృ సంస్థకు బదిలీ చేయాలని నిర్ణయించారు. ఒక్కసారి వచ్చిన వారిని రెండోసారి విధుల్లోకి తీసుకోరాదని నిర్ణయం తీసుకున్నారు.

ఒకేచోట మూడేళ్లుంటే బదిలీనే..
ఒకే చోట మూడేళ్లపాటు విధులు నిర్వహించిన టీటీడీ ఉద్యోగులను మరో విభాగానికి బదిలీ చేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం నవంబర్ 1నుంచి అమల్లోకి రానుంది. కాగా, ఈ సమావేశంలో టీటీడీ ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, రాష్ట్ర దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి మన్మోహన్ సింగ్, కమిషనర్ డా. ఎం పద్మ, ధర్మకర్తల మండలి సభ్యులు సుధా నారాయణమూర్తి, రాయపాటి సాంబశివరావు, బోండా ఉమామహేశ్వరరావు, ఇ పెద్దిరెడ్డి, రుద్రరాజు పద్మరాజు, మేడా రామకృష్ణారెడ్డి, చల్లా రమచంద్రారెడ్డి, బీకే పార్థసారథి, శివాజీ, సండ్ర వెంకటవీరయ్య, డొక్కా జగన్నాథం, ప్రత్యేక ఆహ్వానితులు కే రాఘవేంద్రరావు, శ్రీకృష్ణ, తిరుమల జేఈఓ కేఎస్ శ్రీనివాసరాజు పాల్గొన్నారు.
-
ఉపాసన, కావ్య మారన్ కు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!! -
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!! -
మందు బాబుల పై ధరల బాంబు- మద్యం రేట్లు భారీగా పెంపు, వీటికి మినహాయింపు..!! -
LKG, UKG ఇక సర్కారు బడిలోనే.. 6 వేల కొత్త ఉద్యోగాల! -
CSK vs RCB: ఓటమికి కారణమెవరంటే ? నిజాయితీగా చెప్పేసిన రుతురాజ్..! -
ఆ ఉద్యోగులను రెండు నెలల్లో పర్మినెంట్ చెయ్యండి.. హైకోర్టు కీలక ఆదేశాలు! -
పొంచి ఉన్న తుఫాన్ ముప్పు, భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
నరసాపురం To అరుణాచలం, బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్..! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరే వేళ ఊహించని ట్విస్ట్..!! -
షాకిచ్చిన నటాషా.. హార్దిక్ లైఫ్లో ఊహించని ట్విస్ట్! -
గంటన్నారలో అమరావతి టు హైదరాబాద్, కేంద్రం కీలక నిర్ణయం..!! -
ఏమిటీ వింత? తెల్ల పులికి పుట్టిన పసుపు పిల్లలు..












Click it and Unblock the Notifications