ఏపీకి పిడుగుల గండం: నేడు, రేపు కోస్తాంధ్ర 'బీ అలర్ట్'!..
విశాఖపట్నం: ఎండాకాలం మొదలైనప్పటినుంచి ఆంధ్రప్రదేశ్ లో వాతావరణం అనూహ్యంగా మారుతూ వస్తోంది. ఎప్పుడు మబ్బులు కమ్ముకుంటాయో చెప్పలేని పరిస్థితి. దానికి తోడు పిడుగులు వణికిస్తున్నాయి. వేల సంఖ్యలో పడుతున్న పిడుగులతో జనం బెంబేలెత్తిపోతున్నారు.
గత మంగళవారం ఒక్కరోజే 40వేల పైచిలుకు పిడుగులు పడ్డాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదే పరిస్థితి మున్ముందు కూడా కొనసాగుతుందని వాతావరణశాఖ నిపుణులు చెబుుతున్నారు. శని, ఆదివారాల్లో ఉత్తర కోస్తాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన అకాల వర్షంతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ విభాగం(ఐఎండీ) శుక్రవారం రాత్రి ఒక నివేదికలో తెలిపింది.

కోస్తాంధ్ర, రాయలసీమల్లోనూ తేలికపాటి జల్లులు, వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు పేర్కొంది. కాగా, శుక్రవారం రాష్ట్రంలో పలుచోట్ల ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. అనంతపురంలో అత్యధికంగా 39డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గడిచిన 24గంటల్లో కోడూరులో 15, తిరుమలలో 10, కదిరి,ఓబులదేవర చెరువు, నూజివీడు, నల్లమడ, పాకాలల్లో 7, అవనిగడ్డ, తిరుపతి ప్రాంతాల్లో 6సెం.మీ వర్షపాతం నమోదైంది.
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications