ఏపీకి పిడుగుల గండం: నేడు, రేపు కోస్తాంధ్ర 'బీ అలర్ట్'!..
విశాఖపట్నం: ఎండాకాలం మొదలైనప్పటినుంచి ఆంధ్రప్రదేశ్ లో వాతావరణం అనూహ్యంగా మారుతూ వస్తోంది. ఎప్పుడు మబ్బులు కమ్ముకుంటాయో చెప్పలేని పరిస్థితి. దానికి తోడు పిడుగులు వణికిస్తున్నాయి. వేల సంఖ్యలో పడుతున్న పిడుగులతో జనం బెంబేలెత్తిపోతున్నారు.
గత మంగళవారం ఒక్కరోజే 40వేల పైచిలుకు పిడుగులు పడ్డాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదే పరిస్థితి మున్ముందు కూడా కొనసాగుతుందని వాతావరణశాఖ నిపుణులు చెబుుతున్నారు. శని, ఆదివారాల్లో ఉత్తర కోస్తాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన అకాల వర్షంతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ విభాగం(ఐఎండీ) శుక్రవారం రాత్రి ఒక నివేదికలో తెలిపింది.

కోస్తాంధ్ర, రాయలసీమల్లోనూ తేలికపాటి జల్లులు, వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు పేర్కొంది. కాగా, శుక్రవారం రాష్ట్రంలో పలుచోట్ల ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. అనంతపురంలో అత్యధికంగా 39డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గడిచిన 24గంటల్లో కోడూరులో 15, తిరుమలలో 10, కదిరి,ఓబులదేవర చెరువు, నూజివీడు, నల్లమడ, పాకాలల్లో 7, అవనిగడ్డ, తిరుపతి ప్రాంతాల్లో 6సెం.మీ వర్షపాతం నమోదైంది.
-
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్












Click it and Unblock the Notifications