గాలి ముద్దుకృష్ణమనాయుడు వారసుడెవరు?
చిత్తూరు: టిడిపి సీనియర్ నాయకుడు గాలి ముద్దుకృష్ణమనాయుడు హఠాత్తుగా మరణించడంతో నగరి నియోజకవర్గంలో టిడిపి ఇంచార్జీ బాధ్యతలు టిడిపి చీఫ్ చంద్రబాబునాయుడు ఎవరికీ అప్పగిస్తారనే చర్చ ప్రారంభమైంది.
ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందనే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో నగరి నియోజకవర్గంలో టిడిపి బాధ్యతలను ఎవరికి దక్కనున్నాయనే విషయమై ప్రస్తుతం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Recommended Video

మాజీ మంత్రి , టిడిపి ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు నాలుగు రోజుల క్రితం హైద్రాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. దీంతో నగరి అసెంబ్లీ నియోజకవర్గానికి ఇంచార్జీ భాద్యతల విషయమై చర్చ తెరమీదికి వచ్చింది.
నిర్ణీత షెడ్యూల్ కంటే ముందే ఎన్నికలు జరిగే అవకాశం ఉందనే ప్రచారం కూడ లేకపోలేదు.ఈ తరుణంలో త్వరలోనే నగరి అసెంబ్లీ స్థానానికి టిడిపి ఇంచార్జీ బాధ్యతలపై చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.

అజాత శత్రువు ముద్దుకృష్ణమనాయుడు
మాజీ మంత్రి ముద్దుకృష్ణమనాయుడుకు అజాతశత్రువుగా పేరుంది. అన్ని పార్టీలకు చెందిన నేతలతో ముద్దుకృష్ణమనాయుడుకు సంబంధాలున్నాయి. దీని కారణంగానే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గాలి ముద్దుకృష్ణమనాయుడు చిత్తూరు జిల్లా నుండి ఎమ్మెల్సీగా ఏక గ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికలకు ఏడాది ముందే అనారోగ్య కారణాలతో గాలి ముద్దుకృష్ణమనాయుడు మృత్యువాత పడడంతో రాజకీయ వారసత్వం గురించి చర్చ తెరమీదకి వచ్చింది.

తండ్రికి తోడుగా కొడుకులు రాజకీయాల్లో
నగరి అసెంబ్లీ నియోజకవర్గం నుండి గత ఎన్నికల్లో బరిలో దిగిన గాలి ముద్దుకృష్ణమనాయుడుకు ఇద్దరు కొడుకులు చేదోడు వాదోడుగా ఉన్నారు. అయితే రానున్న ఎన్నికల్లో టిడిపి అభ్యర్ధిగా గాలి ముద్దుకృష్ణనాయుడు కొడుకుల్లో ఎవరు రంగంలోకి దిగుతారనే విషయమై ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది

ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు
2015లో గాలి ముద్దుకృష్ణమనాయుడు స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. పదవి కాలం ఇంకా పూర్తి కాలేదు.దీంతో ఎమ్మెల్సీ స్థానానికి కూడ ఎన్నికలు జరిగే అవకాశం లేకపోలేదు. అయితే ఎన్నికల షెడ్యూల్ విడదుల కావడానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. ఈ తరుణంలో ఎమ్మెల్సీ పదవికి గాలి ముద్దుకృష్ణమనాయుడు కుటుంబంలో ఎవరు ఆసక్తి చూపుతారు, పార్టీ నాయకత్వం ఎవరికీ ఈ పదవిని కట్టబెట్టనుందనే విషయాలపై చర్చ సాగుతోంది.

నగరి టిడిపి బాధ్యతలు ఎవరికి
నగరి టిడిపి అసెంబ్లీ ఇంచార్జీగా గాలి ముద్దుకృష్ణనాయుడు కొనసాగుతున్నాడు అయితే ముద్దుకృష్ణమనాయుడు మరణంతో కొత్త వ్యక్తికి ఈ బాధ్యతలను కట్టబెట్టాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.. ముద్దుకృష్ణమనాయుడు కొడుకుల్లో ఎవరు ఈ పదవిపై ఆసక్తిని చూపుతారనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. వీరిద్దరిలో ఒకరికి ఈ బాధ్యతలను అప్పగిస్తారా, సీనియర్ నేత ఎవరికైనా ఈ పదవిని కట్టబెడతారా అనే విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉందంటున్నారు పార్టీ నేతలు
-
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్












Click it and Unblock the Notifications