వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలుగు సెంటిమెంటంటే చులకనా, మోడీ ఎందుకు మాట్లాడలేదు, అసమర్ధుడినా?: బాబు

By Narsimha
|
Google Oneindia TeluguNews

Recommended Video

నాపై దాడి చేస్తున్నారు, అసమర్ధుడిని అనుకున్నారా ?: బాబు

అమరావతి: రాష్ట్రానికి న్యాయం చేయకుండా కేంద్రం తీవ్రమైన అన్యాయానికి పాల్పడిందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయమై కేంద్రం డొంక తిరుగుడు సమాధానం చెబుతోందన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఎన్డీఏ నుండి బయటకు వచ్చినట్టు చంద్రబాబునాయుడు చెప్పారు. ఎన్డీఏతో తెగదెంపులు చేసుకొన్నాకే కేంద్రంపై అవిశ్వాసం ప్రవేశపెట్టినట్టు చంద్రబాబునాయుడు చెప్పారు.

శాసనమండలిలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు శుక్రవారం నాడు మాట్లాడారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై తన ప్రసంగంలో చంద్రబాబునాయుడు నిప్పులు చెరిగారు.పొట్టిశ్రీరాములుకు ఏపీ శాసనమండలి ఘనంగా నివాళులర్పించింది.

ఈ సందర్భంగా తన ప్రసంగంలో బాబు పొట్టి శ్రీరాములు పోరాట స్పూర్తిని గుర్తు చేశారు. విభజన చట్టంతో పాటు, ప్రత్యేక హోదాను ఇవ్వాలన్నారు. అంతేకాదు రాజ్యసభలో ఇచ్చిన హమీలను కూడ రాష్ట్రానికి అమలు చేయాలని కోరారు.

రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఎన్డీఏ నుండి బయటకు

రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఎన్డీఏ నుండి బయటకు

రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఎన్డీఏ నుండి బయటకు వచ్చినట్టు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు.ఫైనాన్స్ బిల్లు వరకు ఎదురుచూసినట్టు బాబు చెప్పారు. కానీ, కేంద్రం నుండి రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎలాంటి న్యాయం చేయలేదు. దీంతో ఎన్డీఏ నుండి బయటకు వచ్చినట్టు చెప్పారు. కేంద్రంపై అవిశ్వాసం పెట్టేందుకు ఎన్డీఏతో తెగదెంపులు చేసుకొన్నాకే అవిశ్వాస నోటీసును ఇచ్చినట్టు చెప్పారు.

ప్రధానమంత్రి ఏం చేశారు

ప్రధానమంత్రి ఏం చేశారు

రాష్ట్రానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ ఉభయ సభల్లో ఎంపీలు ఆందోళన చేస్తోంటే ప్రధానమంత్రి ఏం చేశారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. మిత్రపక్షంగా ఉన్న టిడిపి ఎంపీలు ఎందుకు ఆందోళన చేస్తున్నారనే విషయమై ఎందుకు మాట్లాడలేదని బాబు ప్రశ్నించారు. ఎన్డీఏకు నాయకత్వం వహిస్తున్న బిజెపి కూడ ఎందుకు ఈ విషయమై ఎందుకు చర్చించలేదని బాబు ప్రశ్నించారు ఎందుకు పోరాటం చేస్తున్నారు. మేం ఉన్నామని చెప్పిన ప్రధానమంత్రి మోడీ ఎందుకు తన హమీని నెరవేర్చుకోలేదని బాబు ప్రశ్నించారు.

తెలుగు సెంటిమెంట్ అంటే చులకనా

తెలుగు సెంటిమెంట్ అంటే చులకనా

తెలుగు వారి ఆత్మగౌరవం కోసం తెలుగుదేశం పార్టీ పుట్టిందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. ప్రత్యేక హోదా ఆలస్యం అవుతోందని ఉద్దేశ్యంతో ప్రత్యేక ప్యాకేజీని ఒప్పుకొన్నట్టు చెప్పారు. కానీ, నాలుగేళ్ళుగా కేంద్రం రాష్ట్ర విభజన బిల్లును అమలు చేయలేదన్నారు. రాష్ట్ర డిమాండ్లపై కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. తెలుగు సెంటిమెంట్‌ అంటే అంత చులకన అని బాబు ప్రశ్నించారు.

కఠిన నిర్ణయానికి బిజెపి నేతలు ఆలోచించుకోవాలి

కఠిన నిర్ణయానికి బిజెపి నేతలు ఆలోచించుకోవాలి

ఎన్డీఏ నుండి తాము బయటకు రావడానికి గల కారణాలను బిజెపి నేతలు అన్వేషించుకోవాలని ఏఫీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. తాను ఎందుకు కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో బిజెపి నేతలు ఆలోచించుకోవాలని బాబు గుర్తు చేశారు. పదవుల కోసం తాము కేంద్ర మంత్రివర్గంలో చేరలేదని చెప్పారు.

ఎదురుదాడి చేస్తున్నారు

ఎదురుదాడి చేస్తున్నారు

ఎన్డీఏ నుండి బయటకు వచ్చిన తర్వాత తనపై ఎదురుదాడి చేస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. తాను అసమర్ధుడినని ప్రచారం చేస్తున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్డీఏ నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు అయితే గతంలో ఆగష్టు సంక్షోభాన్ని ప్రస్తావించారు. ఇంధిరాగాంధీ ఎన్టీఆర్‌ను గద్దె దించిందని చెప్పారు కానీ, ప్రజల నుండి వచ్చిన వ్యతిరేక కారణంగా తిరిగి ఎన్టీఆర్‌ను అధికారంలోకి తీసుకువచ్చిందన్నారు. తాను ఎవరికీ భయపడేది లేదన్నారు.

English summary
Chandrababu Naidu said that he was came out from NDA for the interests of Ap. He addressed in legislative council on Friday.Why Modi not discussed with alliance party about protest in parliament sessions asked Chandrababunaidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X