బొజ్జల పాడే మోసిన ప్రాణ స్నేహితుడు చంద్రబాబు.. తుది నివాళి
టీడీపీ సీనియర్ నేత బొజ్జల గోపాల కృష్ణారెడ్డి మృతితో పార్టీ శ్రేణులు విషాదంలో మునిగిపోయాయి. ఇవాళ స్వ గ్రామం ఊరందూరులో అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియలకు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హజరయ్యారు. బొజ్జల పాడెను చంద్రబాబు మోశారు. తుది వీడ్కోలు పలికేందుకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలి వచ్చారు. బొజ్జల స్వస్థలం శ్రీకాళహస్తి మండలం, ఊరందూరులో అంత్యక్రియలు జరిగాయి.
శోకసంద్రంలో..
శనివారం
మధ్యాహ్నం
హైదరాబాద్
నుంచి
విమానంలో
తిరుపతి
విమానాశ్రయానికి
బొజ్జల
భౌతికకాయాన్ని
కుటుంబ
సభ్యులు
తీసుకొచ్చారు.
రోడ్డు
మార్గాన
శ్రీకాళహస్తిలోని
టీడీపీ
కార్యాలయానికి
తరలించారు.
గంట
పాటు
ప్రజల
సందర్శనార్థం
పార్థీవదేహం
ఉంచారు.
తర్వాత
పట్టణ
ప్రధాన
వీధుల
మీదుగా
ఊరేగింపుగా
మధ్యాహ్నం
2.20
గంటలకు
ఊరందూరుకు
తరలించారు.
పార్థివదేహం
చూడగానే
కుటుంబసభ్యులు,
బంధువులు,
గ్రామస్తులు
భోరున
విలపించడంతో
గ్రామ
శోకసంద్రంలో
మునిగిపోయింది.
విలపించిన కూతురు
అమెరికా
నుంచి
అప్పటికే
ఇంటికి
చేరుకున్న
బొజ్జల
కుమార్తె
పద్మరేఖ
బోరున
విలపించారు.
శ్రీకాళహస్తిలోని
శుకబ్రహ్మ
ఆశ్రమ
పీఠాధిపతి
విద్యా
స్వరూపానందగిరి
స్వామి,
మంత్రి
పెద్దిరెడ్డి
రామచంద్రారెడ్డి,
మాజీ
మంత్రులు
తుమ్మల
నాగేశ్వరరావు,
సోమిరెడ్డి
చంద్రమోహన్రెడ్డి,
అమరనాథ్రెడ్డి,
టీడీపీ
జాతీయ
ప్రధాన
కార్యదర్శి
నల్లారి
కిశోర్కుమార్రెడ్డి,
ప్రముఖ
పారిశ్రామికవేత్త
గల్లా
రామచంద్రనాయుడు,
ఎమ్మెల్సీ
దొరబాబు,
వైసీపీ
ఎంపీ
గురుమూర్తి,
వైసీపీ
ఎమ్మెల్యేలు
చెవిరెడ్డి
భాస్కర్రెడ్డి,
బియ్యపు
మధుసూదన్రెడ్డి,
అమర
ఆస్పత్రి
అధినేత
రమాదేవి,
బీజేపీ
రాష్ట్ర
అధికార
ప్రతినిధి
భానుప్రకాశ్రెడ్డి,
మాజీ
ఎమ్మెల్సీ
గౌనివారి
శ్రీనివాసులు,
జడ్పీ
మాజీ
చైర్పర్సన్
గీర్వాణి,
తిరుపతి
పార్లమెంటు
టీడీపీ
అధ్యక్షుడు
నరసింహ
యాదవ్
తదితరులు
నివాళులు
అర్పించారు.
నేపథ్యం
బొజ్జల
స్వస్థలం
శ్రీకాళహస్తి
సమీపంలోని
ఊరందూరు..
ఆయన
1949
ఏప్రిల్
15వ
తేదీన
గంగసుబ్బరామిరెడ్డి
దంపతులకు
జన్మించారు.
గగసుబ్బరామిరెడ్డి
కూడా
శ్రీకాళహస్తి
ఎమ్మెల్యేగా
పనిచేశారు.
శ్రీవెంకటేశ్వర
వర్శిటీ
నుంచి
1968లో
బొజ్జల
బీఎస్సీ
చేశారు.
1972లో
లా
పూర్తయ్యాక..
పెళ్లయ్యింది.
లా
ప్రాక్టీసు
కోసం
హైదరాబాద్
వచ్చి..
తర్వాత
రాజకీయాల్లోకి
ఎంట్రీ
ఇచ్చారు.
రాజకీయ రంగ ప్రవేశం
1989,
94,
98,
2009,
2014లో
శ్రీకాళహస్తి
నుంచి
టీడీపీ
అభ్యర్థిగా
పోటీచేసి
ఎమ్మెల్యేగా
విజయం
సాధించారు.
1994-2004
మధ్య
చంద్రబాబు
కేబినెట్లో
ఐటీ
మంత్రిగా,
రోడ్లు-భవనాల
శాఖా
మంత్రిగా
బాధ్యతలు
నిర్వర్తించారు.
2004
ఎన్నికల్లో
ఓటమి
ఎదురైంది.
మళ్ళీ
2009
ఎన్నికల్లో
శ్రీకాళహస్తి
ఎమ్మెల్యేగా
ఎన్నికయ్యారు.
విభజన
తర్వాత
జరిగిన
2014
ఎన్నికల్లో
మళ్లీ
విజయం
సాధించగా..
చంద్రబాబు
కేబినెట్లో
అటవీశాఖ
మంత్రిగా
పనిచేశారు.
2019
ఎన్నికల్లో
మాత్రం
గోపాలకృష్ణారెడ్డి
ఎన్నికల్లో
పోటీ
చేయలేదు.
రాజకీయవారసుడిగా
కుమారుడు
సుధీర్
రెడ్డిని
బరిలోకి
దింపగా
ఓటమి
ఎదురైంది.
తర్వాత
అనారోగ్యంతో
బాధపడుతున్న
సంగతి
తెలిసిందే.