రూ. కోటి 10 లక్షల లంచం కేసు: కీసర మాజీ తహశీల్దార్ నాగరాజు ఆత్మహత్య: కస్టడీలో
హైదరాబాద్: కీసర మాజీ తహశీల్దార్ నాగరాజు ఆత్మహత్య చేసుకున్నారు. దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన కోటి 10 లక్షల రూపాయల లంచం కేసులో నిందితుడిగా విచారణను ఎదుర్కొంటోన్న ఆయన ఈ తెల్లవారు జామున చంచల్గూడ కేంద్ర కారాగారంలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ప్రస్తుతం ఆయన అవినీతి నిరోధక శాఖ అధికారుల అదుపులో ఉన్నారు. విచారణను ఎదుర్కొంటున్నారు. నెలరోజులకుగా పైగా విచారణ కొనసాగుతోంది. ఆయన ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. పోస్ట్మార్టమ్ కోసం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
కీసర తహశీల్దారుగా పనిచేస్తోన్న సమయంలో తన పరిధిలోని రాంపల్లి దాయిరాలో 28 ఎకరాల స్థలాన్ని మ్యూటేషన్ చేయడానికి రియల్ ఎస్టేట్ వ్యాపారుల వద్ద నుంచి ఆ కోటి 10 లక్షలు లంచం డిమాండ్ చేశారు. ఆ మొత్తాన్ని తీసుకుంటూ ఆయన అవినీతి నిరోధక అధికారులకు రెడ్ హ్యాండెండ్గా దొరికిపోయారు. ఈ కేసులో ఆయన విచారణను ఎదుర్కొంటున్నారు. కోటి 10 లక్షల రూపాయల లంచాన్ని తీసుకుంటూ దొరికిపోవడం అవినీతి నిరోధక శాఖ చరిత్రలో ఇదే తొలిసారి అనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. అతి పెద్ద ట్రాప్గా దీన్ని భావించారు.

విచారణ సందర్భంగా నాగరాజుకు సంబంధించిన మరిన్ని అవినీతి కార్యకలాపాలు వెలుగులోకి వచ్చాయి. తొలి కేసులో నాగరాజు ఇటీవలే బెయిల్పై విడుదల అయ్యారు. భూ మ్యుటేషన్ కేసులో ఆయనపై రెండోసారి కూడా కేసు నమోదు చేశారు అధికారులు. మంగళవారమే ఆయనను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు మరో అయిదుమందిపై కేసు నమోదైంది. ఈ కేసులో మరింత సమాచారాన్ని సేకరించడానికి అధికారులు ప్రయత్నాలు చేపట్టిన ప్రస్తుత పరిస్థితుల్లో నాగరాజు ఆత్మహత్యకు పాల్పడటం సంచలనం రేపుతోంది.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications