జాతిరత్నాలా ఏందీ..? సత్యహరిశ్చంద్రులేం కాదు: రేవంత్ రెడ్డి
మునుగోడు బై పోల్ తర్వాత రాజకీయ పరిణామలు మారిపోతున్నాయి. టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్య డైలాగ్ వార్ కంటిన్యూ అవుతుంది. భారత్ జోడో యాత్ర తర్వాత పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీడియా ముందుకు వచ్చారు. సీఎం కేసీఆర్ లక్ష్యంగా విమర్శలు చేశారు. బీజేపీని కూడా వదల్లేదు. ఎమ్మెల్యేల కొనుగోలు అంశాన్ని మాట్లాడారు. ఆ నలుగురు ఎమ్మెల్యేలను కేసీఆర్ ప్రశంసించడంపై మండిపడ్డారు. వారెమైనా జాతిరత్నాల అంటూ విరుచుకుపడ్డారు.

కలుషితం చేసి..
బీజేపీ, టీఆర్ఎస్ రెండు కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని కలుషితం చేస్తున్నాయని రేవంత్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు నాటకానికి తెరలేపాయని హాట్ కామెంట్స్ చేశారు. తమను ప్రలోభపెట్టారని చెబుతున్న ఆ నలుగురు ఎమ్మెల్యేలు సత్యహరిశ్చంద్రుడి వారసులు అని ఎద్దేవా చేశారు. అన్ని చోట్ల కెమెరాలు పెట్టి వాళ్లను పట్టివ్వాలని కేసీఆర్ చెప్పాడంట... వీళ్లు పట్టించారంట అంటూ సెటైర్లు వేశారు.

జాతిరత్నాలా..?
ఆ ఎమ్మెల్యేలను మునుగోడు తీసుకెళ్లి జాతిరత్నాలు అని కేసీఆర్ చెబుతుండటం చూస్తే ఆయనకు మతి తప్పిందేమోననే సందేహాం కలుగుతుందన్నారు. ఈ జాతి రత్నాలు ఎక్కడివి? అని రేవంత్ నిలదీశారు. ఎక్కడ కొట్టుకొచ్చావు వీటిని? అని అడిగారు. కాంగ్రెస్ పార్టీపై గెలిచి అక్కడ అమ్ముడుపోయారు వాళ్లు అని తెలిపారు. మరీ అలాంటి వారు అలాగే ఉంటారా? అని అడిగారు.

వారిని నమ్మి.. రాజకీయం
అలాంటి వారిని నమ్మి రాజకీయం చేస్తున్నావా? అని ప్రశ్నించారు. కొనుగోలుపై వాళ్లు చెప్పగానే కేసీఆర్కు ప్రజాస్వామ్యం గుర్తొచ్చిందా? అన్నారు. కేసీఆర్ ఇంత దిగజారిపోయారా అనిపిస్తోందని విమర్శలు చేశారు. పైగా అతనే సుద్దులు చెబుతున్నారని అడిగారు. కేసీఆర్ ఏం చేశారో తెలంగాణ సమాజం చూసిందని వివరించారు.

కేసీఆర్ బిల్డప్
ఆ నలుగురు జాతి రత్నాలు అని కేసీఆర్ బిల్డప్ ఇచ్చారని మండిపడ్డారు. కాంగ్రెస్- టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినవారు.. మరో పార్టీలోకి వెళ్లారని మీరెలా అనుకుంటారని ప్రశ్నించారు. పైగా వారు చేసింది కరెక్ట్ అని.. అమ్ముడు పోలేదని అంటారా అని నిలదీశారు. ఆ రెండు పార్టీలు విలువలు లేకుండా ప్రవర్తించాయని మండిపడ్డారు.
-
హైదరాబాద్ కు మరో మణిహారం..దేశంలోనే రెండో నెట్ఫ్లిక్స్ ఆఫీస్ ప్రారంభం.. ఎప్పుడంటే! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, మూడు రోజుల్లో పూర్తి..!! -
మార్చి 21 తర్వాత పాకిస్తాన్ ఉండదు- రాసిపెట్టుకోండి: బాంబు పేల్చిన జ్యోతిష్యురాలు -
today rashiphalalu: రాహుసూర్యుల శక్తివంతమైన యోగంతో ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్ -
కక్ష్యను మార్చకోనున్న బుధుడు.. ఈ రాశుల జీవితం మారిపోతోంది -
అతడు ఇప్పుడు పక్కా మెంటల్లీ టఫ్: రవిశాస్త్రి -
సిగ్గుండాలి.. అనసూయ ఒక్క పోస్ట్తో సైలెన్స్! -
భారత్ కు డొనాల్డ్ ట్రంప్ గుడ్ న్యూస్.. -
ఫైనల్ వేళ టీమిండియాకు మాజీ కోచ్ హెచ్చరిక, అభిషేక్ బ్యాటింగ్ ఆర్డర్ ఇక..!! -
మీ పాత బంగారం చెల్లుతుందా? 2026 కొత్త నిబంధనలు ఇవే! -
EPF 2026 అమల్లోకి: డబ్బులు ఎన్నిసార్లు తీసుకోవచ్చో తెలుసా?












Click it and Unblock the Notifications