రేప్ చేసి వేశ్య అంటే...దిమ్మతిరిగే షాక్, ఏమైందంటే?
న్యూఢిల్లీ: అత్యాచారం చేసి ఆ తర్వాత బాధితురాలిని వేశ్య అని సంబోధించినందుకు ఢిల్లీ కోర్టు ఏడేళ్ళ జైలు శిక్ష విధించింది. అంతేకాదు బాధితురాలికి రూ. 5 లక్షల పరిహరం చెల్లించాలని ఆదేశించింది.
దక్షిణ ఢిల్లీ ప్రాంతంలోని రాంనగర్లో ముంతాజ్ అలీ అనే వ్యక్తి టైలరింగ్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. 2015 లో తనకు సమీపంలోని దుకాణం నిర్వహిస్తున్న మహిళపై ముంతాజ్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో నిందితుడు బాధితురాలిపై రెండు దఫాలు అత్యాచారం చేశాడు.

అంతేకాదు బాధితురాలి కూతురిని అడ్డుపెట్టుకొని అత్యాచారం చేశాడు. కూతురును కిడ్నాప్ చేసి చంపేస్తానని బెదిరించి ఈ దారుణానికి పాల్పడ్డాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు.
ఈ కేసుపై విచారణ సాగుతున్న సమయంలోనే బాధితురాలిని వేశ్య అంటూ ముంతాజ్ పిలిచాడు. ఈ విషయమై కోర్టు సీరియస్ అయింది. బహిరంగ ప్రదేశంలో మహిళ పట్ల అమర్యాదగా దూషించినందుకు ముంతాజ్ అలీకి రూ. లక్ష జరిమానాను విధించింది.
దీనికి తోడుగా ఏడేళ్ళ పాటు కఠిన కారాగార శిక్షను విధించింది. బాధితురాలికి నిందితుడు రూ. 5లక్షల పరిహరం చెల్లించాల్సిందిగా తీర్పు ఇచ్చింది. ఈ విషయమై బాధితురాలి తరపు న్యాయవాది నిందితుడి గురించి పలు సాక్ష్యాలను కోర్టులో ప్రవేశపెట్టడంతో నిందితుడికి శిక్షలు కఠినమైన శిక్షలను విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది.
బహిరంగ ప్రదేశాల్లో మహిళలను అగౌరవంగా మాట్లాడడం ఫ్యాషన్గా మారిందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. స్త్రీలను గౌరవించకుండా అవమానించినందుకు నిందితుడికి ఈ శిక్షను విధించినట్టుగా ఆయన ప్రకటించారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications