వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అజ్మీర్ దర్గా పేలుళ్ల కేసు: దోషులకు జీవితఖైదు.. శిక్ష ఖరారు చేసిన ఎన్ఐఏ న్యాయస్థానం

అజ్మీర్ దర్గా పేలుళ్ల కేసులో దోషులు దేవేంద్ర గుప్తా, భవేశ్ పటేల్ కు జీవితఖైదు శిక్షను ఖరారు చేస్తూ ఎన్ఐఏ స్పెషల్ కోర్టు బుధవారం తీర్పును వెలువరించింది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: అజ్మీర్ దర్గా పేలుళ్ల కేసు దోషులకు ఎన్ఐఏ కోర్టు జీవితఖైదు విధించింది. 2007 అక్టోబర్ 11న రంజాన్ మాసంలో దర్గా వద్ద పేలుళ్లు జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో దేవేంద్ర గుప్తా, భవేశ్ పటేల్ కు శిక్షను ఖరారు చేస్తూ ఎన్ఐఏ స్పెషల్ కోర్టు బుధవారం తీర్పును వెలువరించింది.

దోషులు భవేశ్ పటేల్, దేవేంద్ర గుప్తా.. ఇద్దరూ ఆరెస్సెస్ మాజీ ప్రచారక్ లు. ఓ ఉగ్రవాద కేసులో ఆరెస్సెస్ అనుబంధ వ్యక్తలును దోషులుగా తేల్చడం ఇదే మొదటిసారి. ఇదే కేసులో మూడో దోషిగా ఉన్న ఆరెస్సెస్ ప్రచారకర్త సునీల్ జోషి 2007 డిసెంబర్ లో హత్యకు గురయ్యాడు.

Ajmer blast case: Two including a former RSS worker get life imprisonment

అజ్మీర్ పేలుళ్ల కేసులో ఎన్ఐఏ కోర్టు మొత్తం ముగ్గురిని దోషులుగా తేల్చింది. మరో ఏడు మందిని నిర్దోషులుగా ప్రకటించింది. స్వామి అసిమానంద్ కూడా ఈ కేసులో నిర్దోషిగా తేలారు.

2007 అక్టోబర్ 11న రంజాన్ మాసంలో సూఫీ ఖ్వాజా మొయినుద్దీన్ దర్గాలో పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా 17 మంది గాయపడ్డారు. పేలుడు జరిగినప్పుడు దర్గాలో సుమారు అయిదే వేల మంది వరకు ఉన్నారు.

English summary
The National Investigation Agency (NIA) special court in Jaipur today sentenced Devendra Gupta and Bhavesh Patel to life in jail in the Ajmer blast case.The two were convicted along with Sunil Joshi on March 6. Joshi died under mysterious circumstances soon after the bombing, in which three people were killed and 17 others were injured. The October 11, 2007 blast took place during the month of Ramazan and targeted the Khwaja Chishti shrine.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X