అజ్మీర్ దర్గా పేలుళ్ల కేసు: దోషులకు జీవితఖైదు.. శిక్ష ఖరారు చేసిన ఎన్ఐఏ న్యాయస్థానం
అజ్మీర్ దర్గా పేలుళ్ల కేసులో దోషులు దేవేంద్ర గుప్తా, భవేశ్ పటేల్ కు జీవితఖైదు శిక్షను ఖరారు చేస్తూ ఎన్ఐఏ స్పెషల్ కోర్టు బుధవారం తీర్పును వెలువరించింది.
ఢిల్లీ: అజ్మీర్ దర్గా పేలుళ్ల కేసు దోషులకు ఎన్ఐఏ కోర్టు జీవితఖైదు విధించింది. 2007 అక్టోబర్ 11న రంజాన్ మాసంలో దర్గా వద్ద పేలుళ్లు జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో దేవేంద్ర గుప్తా, భవేశ్ పటేల్ కు శిక్షను ఖరారు చేస్తూ ఎన్ఐఏ స్పెషల్ కోర్టు బుధవారం తీర్పును వెలువరించింది.
దోషులు భవేశ్ పటేల్, దేవేంద్ర గుప్తా.. ఇద్దరూ ఆరెస్సెస్ మాజీ ప్రచారక్ లు. ఓ ఉగ్రవాద కేసులో ఆరెస్సెస్ అనుబంధ వ్యక్తలును దోషులుగా తేల్చడం ఇదే మొదటిసారి. ఇదే కేసులో మూడో దోషిగా ఉన్న ఆరెస్సెస్ ప్రచారకర్త సునీల్ జోషి 2007 డిసెంబర్ లో హత్యకు గురయ్యాడు.

అజ్మీర్ పేలుళ్ల కేసులో ఎన్ఐఏ కోర్టు మొత్తం ముగ్గురిని దోషులుగా తేల్చింది. మరో ఏడు మందిని నిర్దోషులుగా ప్రకటించింది. స్వామి అసిమానంద్ కూడా ఈ కేసులో నిర్దోషిగా తేలారు.
2007 అక్టోబర్ 11న రంజాన్ మాసంలో సూఫీ ఖ్వాజా మొయినుద్దీన్ దర్గాలో పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా 17 మంది గాయపడ్డారు. పేలుడు జరిగినప్పుడు దర్గాలో సుమారు అయిదే వేల మంది వరకు ఉన్నారు.
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications