ఆర్జేడీకి నితీష్ దూరం, సీటు మార్పించుకున్నారు
బీహార్లో రాజకీయ సంక్షోభం ముదిరింది. ప్రభుత్వ కార్యక్రమం వేదికగా జేడీయూ-ఆర్జేడీ మధ్య శనివారం విభేదాలు బయటపడ్డాయి. అంతర్జాతీయ యువ నైపుణ్య దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సీఎం నితీష్.
పాట్నా: బీహార్లో రాజకీయ సంక్షోభం ముదిరింది. ప్రభుత్వ కార్యక్రమం వేదికగా జేడీయూ-ఆర్జేడీ మధ్య శనివారం విభేదాలు బయటపడ్డాయి. అంతర్జాతీయ యువ నైపుణ్య దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సీఎం నితీష్ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ గైర్హాజరయ్యారు. వేదికపై ఆర్జేడీ మంత్రి పక్కనున్న తన సీటును సీఎం నితీష్ మార్పించడంతో విభేదాలు తారాస్థాయికి చేరాయని, ఎప్పుడైనా ఆర్జేడీతో జేడీయూ తెగతెంపులు ఖాయమంటున్నారు.

తేజస్వి ఎందుకు రాలేదో తమకు తెలియదని ఆర్జేడీ నేత, కార్మిక సాఖ మంత్రి విజయ్ ప్రకాశ్ చెప్పారు. కాగా, కార్యక్రమం ప్రారంభంలో ఆర్జేడీ మంత్రి విజయ్ ప్రకాశ్ పక్కనే సీఎం నితీష్ కూర్చున్నారు. కాసేపటికి తన సీటును జేడీయూ మంత్రి పక్కకు మార్పించుకున్నారు నితీష్.
పరిస్థితులపై సోనియా-శరద్ల చర్చ
నీతీశ్-లాలూల మధ్య దూరం పెరుగుతున్న నేపథ్యంలో మహాకూటమిలో మరో భాగస్వామి అయిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితులను గమనిస్తోంది.
జేడీ(యు) అధ్యక్షుడు శరద్ యాదవ్ కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీని ఆమె నివాసంలో కలిశారు. దాదాపు 40 నిమిషాలపాటు చర్చించారు. మహాకూటమి కొనసాగాలన్న విషయంపై చర్చలు జరిగాయని తెలుస్తోంది
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications