మృత్యువుతో పోరాడుతున్న ఉన్నావ్ బాధితురాలు .. 48 గంటలు గడిస్తే గానీ ఏం చెప్పలేమంటున్న వైద్యులు
ఉన్నావ్ : రోడ్డు ప్రమాదానికి గురైన ఉన్నావ్ లైంగికదాడి బాధితురాలి పరిస్థితి సీరియస్గా ఉంది. ఊపిరితిత్తుల నుంచి రక్తం కారుతుందని, శరీరంలో చాలా చోట్ల ఎముకలు విరిగాయని వైద్యులు చెప్తున్నారు. ఆమెకు వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నామని .. మరో 48 గంటలు గడిస్తే గానీ ఏం చెప్పలేమని వైద్యులు స్పష్టంచేశారు. దీంతో ఆమె తల్లి .. తన కూతురు కోలుకోవాలని ఆ భగవంతుడిని వేడుకుంటుంది. ఆమెకు ఈ పరిస్థితికి గురిచేసిన సెంగార్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది.

మృత్యువుతో పోరాటం
ఉన్నావ్ లైంగికదాడి బాధితురాలు చావుతో పోరాడుతున్నారు. రాయ్ బరేలిలో ఉన్న బంధువులను చూసేందుకు వెళ్తుండగా ట్రక్కురూపంలో మృత్యువు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఇద్దరు చనిపోగా .. బాధితురాలు, లాయర్ మృత్యువుతో పోరాటమే చేస్తున్నారు. ఆమెను మెరుగైన వైద్యం కోసం లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ వర్సిటీ ట్రామా సెంటర్కు తరలించారు. ఆమెకు 40 గంటల నుంచి వైద్యం అందిస్తున్న శరీరం స్పందించడం లేదు. వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. మరో 48 గంటలు గడిస్తే తప్ప ఏం చెప్పలేమని పేర్కొన్నారు.

విరిగిన పక్కటెముకలు
ట్రక్కు ప్రమాదంలో బాధితురాలు తీవ్రంగా గాయపడ్డారు. పక్కటెములు విరిగాయి. ఊపిరితిత్తుల నుంచి రక్తం కారుతుందని వైద్యులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన తర్వాత ఆమె సృహలో లేరని .. కాలిలో వివిధ చోట్ల ఎముకలు విరిగిపోయినట్టు వైద్యులు తెలిపారు. ఊపిరితిత్తులు పనిచేసేందుకు కృత్రిమ ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. వెంటిలేటర్ లేకుంటే ఊపిరి తీసుకోవడానికి కూడా కష్టపడుతున్నారని వివరించారు.

ఎమ్మెల్యేపై సస్పెన్షన్ వేటు
మరోవైపు ఉన్నావ్ లైంగికదాడి బాధితురాలి ప్రమాదంపై బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్పై సర్వత్రా విమర్శలు రావడంతో ఆ పార్టీ స్పందించింది. ఈ కేసును ఇప్పటికే సీబీఐకి అప్పగించిన యూపీ బీజేపీ సర్కార్ .. తాజాగా సెంగార్పై సస్పెన్షన్ వేటు వేసింది. లైంగికదాడి బాధితురాలి ప్రమాదానికి సెంగారే కారణమని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ క్రమంలో సెంగార్పై చర్యలు తీసుకోవాలని విపక్షాలు ముక్తకంఠంతో డిమాండ్ చేశాయి. దీంతో బీజేపీ హైకమాండ్ ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఉన్నావ్ లైంగికదాడి గురించి గతేడాదే బీజేపీ క్రమశిక్షణ కమిటీ విచారణ జరిపిందని తెలిపారు ఆ పార్టీ అధికార ప్రతినిధి రాకేశ్ త్రిపాఠి. దాంతో అతనిపై చర్యలు తీసుకున్నామని వివరించారు. అప్పుడు నోటీసులు ఇచ్చి .. తర్వాత పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు పేర్కొన్నారు. అంతేకాదు బాధితురాలిపై లైంగికదాడి చేసినట్టు విచారణలో తేలిన, యువతి కారు ప్రమాదానికి కారణం సెంగార్ అని తెలిసినా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. తమ పార్టీలో తప్పుచేసినవారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని స్పష్టంచేశారు.
-
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
ఓపెనర్ గా అభిషేక్ స్థానంలో - ఫైనల్ లో భారీ ట్విస్ట్, ఫలించేనా..!! -
India Post GDS Result 2026: పోస్టాఫీస్ జాబ్స్ మెరిట్ లిస్ట్ విడుదల-ఇలా చెక్ చేసుకోండి..! -
ఫైనల్ మ్యాచ్ వర్షం లో కొట్టుకుపోతే, ఛాంపియన్ ఎవరు - ఐసీసీ తాజా రూల్స్..!! -
కోనసీమ వాసుల కల నెరవేర్చే కొత్త రైల్వే లైన్ ప్రాజెక్ట్ లో కీలక అడుగు -
LPG price hike: గ్యాస్ ధరల షాక్-నేటి నుంచి ఒక్కో సిలిండర్ పై పెంపు ఇలా..! -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
`ఉస్తాద్` విషయంలో తెలిసి చేశారో తెలియక చేశారో గానీ.. !!












Click it and Unblock the Notifications