ఢిల్లీలో కూలిన బిల్డింగ్, ముగ్గురు మృతి, శిథిలాల కింద నలుగురు
దేశ రాజధాని ఢిల్లీలో ఓ భవనం కూలిపోయింది. లాహోరి గేట్ వద్ద బాహుళ అంతస్తుల భవనం కూలింది. రాత్రి 7.30 గంటలకు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందింది. వెంటనే అక్కడికి ఐదు ఫైరింజన్లు చేరుకున్నాయి. ప్రమాదంలో శిథిలాల కింద ఏడుకు పైగా చిక్కుకున్నారు. వీరిలో ముగ్గురు చనిపోయారు. నలుగురు శిథిలాల కింద ఉన్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికితీసే కార్యక్రమం కొనసాగుతోంది.
గాయపడ్డవారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇంకా శిథిలాల కింద నలుగురు ఉన్నారని అధికారులు భావిస్తున్నారు. ప్రమాదంతో ఢిల్లీ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. అసలే వర్షాలు.. ఆపై జనం ఇబ్బందులు పడుతున్నారు. వర్షాల వల్లే ఈ ప్రమాదం జరిగింది.సహాయ కార్యక్రమాలు మాత్రం కొనసాగుతున్నాయి. ఇటు ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని స్థానిక అధికారులు తెలియజేశారు.