బుర్హాహన్ వనీ ఎన్కౌంటర్: ప్రాణభయంతో ఏడ్చాడు
శ్రీనగర్: తన రహస్య స్థావరాన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టగానే కరుడు గట్టిన ఉగ్రవాది బుర్హాన్ వనీ ఏడ్వడం ప్రారంభించాడని అంటున్నారు. జులై 8వ తేదీన జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ ప్రాంతంలో భద్రతా బలగాలు ఉగ్రవాదుల రహస్య స్థావరాన్ని చుట్టిముట్టి 22 ఏళ్ల వనీతో పాటు మరో ఇద్దరు మిలిటెంట్లను హతమార్చిన విషయం తెలిసిందే.
15 ఏళ్ల వయస్సులోనే హిజ్బుల్ ముజాహిదీన్ అనే ఉగ్రవాద సంస్థలో చేరి కొద్ది కాలంలోనే టాప్ కమాండర్గా ఎదిగిన బుర్హాన్ వనీ తాను తలదాచుకున్న స్థావరాన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టగానే విలపించడం ప్రారంభించాడని అంటున్నారు. యువతను ఉగ్రవాదంలోకి ఆకర్షించడంలో కీలకపాత్ర పోషించిన బుర్హాన్ వనీ ఇండియన్ ఆర్మీకి మోస్ట్ వాంటెడ్గా మారాడు.

కరుడుగట్టిన కమాండర్గా పేరు తెచ్చుకున్న వనీచివరి నిమిషంలో ప్రాణభయంతో చిన్నపిల్లాడిలా ఏడ్చేశాడనే వార్త ఇప్పుడు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. 2010లో తన సోదరుడిని సెక్యూరిటీ సిబ్బంది వేధించారనే ఒకే ఒక్క కారణంతో వనీ ఉగ్రవాదంవైపు మళ్లాడు.
తను తల దాచుకున్న ప్రాంతాన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టడాన్ని చూసిన 22 ఏళ్ల వనీ ఏడుస్తూనే బలగాలపై రెండు రౌండ్ల కాల్పులు జరిపాడని చెబుతున్నారు. అయితే సెక్యూరిటీ సిబ్బంది కేవలం నాలుగు నిమిషాల్లోనే పని పూర్తి చేసింది.
-
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !! -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!!












Click it and Unblock the Notifications