మహా సంక్షోభం: శరద్ పవార్కు బెదిరింపులు, శివ సైనికులు వీధుల్లోకి వస్తే..: సంజయ్ రౌత్
మహారాష్ట్రలో ఏక్ నాథ్ షిండే తిరుగుబాటుతో శివసేన ఏమీ చేయలేకపోతోంది. ఆ పార్టీ నేత సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ను బీజేపీ బెదిరిస్తోందని ఆరోపించారు. ఓ కేంద్రమంత్రి స్వయంగా పవార్ను బెదిరింపులకు గురిచేస్తోందని వివరించారు. ఈ కామెంట్లు రాజకీయంగా తీవ్ర కలకలం రేపాయి.

ఇంటికి వెళ్లనీయం..
రాష్ట్రంలో కూటమిని కాపాడే ప్రయత్నం చేయొద్దని శదర్ పవార్ను కోరారట. లేదంటే అతనిని ఇంటికి వెళ్లనీయమని చెబుతున్నారు. అయితే తమ కూటమి బతికి బట్టకట్టినా.. లేకపోయినా సరే కానీ శరద్ పవార్ను ఇలా బెదిరించడం సరికాదని సంజయ్ రౌత్ అంటున్నారు. శివ సైనికులను రెచ్చొగొట్టొద్దు అని రౌత్ స్పష్టంచేశారు. ఇప్పటివరకు తాము రోడ్ల మీదకి రాలేదని.. గల్లీలకు వచ్చే పరిస్థితి తీసుకురావొద్దని కోరారు.

ఇప్పుడు లీగల్ ఫైట్
సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ మేరకు నడుచుకుంటామని పేర్కొన్నారు. ఇప్పుడు లీగల్ ఫైట్ నడుస్తోందని.. వివరించారు. కొందరు 40 మంది ఎమ్మెల్యేలు.. మరికొందరు ఫిగర్ అంటున్నారు. కానీ ఎమ్మెల్యేలు ముంబై వచ్చాక పరిస్థితి తెలుస్తోందని వివరించారు. అంతా సర్దుకుంటుందని చెప్పారు. గొడవ నంబర్, పేపర్స్, స్ట్రీట్స్ అని.. ఆ మూడింటిలో శివసేన విజయం సాధిస్తోందని తెలిపారు.

డిప్యూటీ స్పీకర్ అపాయింట్మెంట్ కోరిన షిండే
మరోవైపు నిన్న రాత్రి ఏక్ నాథ్ షిండే డిప్యూటీ స్పీకర్కు లేఖ రాశారు. తమకు అపాయింట్ మెంట్ ఇవ్వాలని కోరారు. ఇప్పటికీ కాంగ్రెస్, ఎన్సీపీ.. శివసేన వెనకాల ఉన్నాయి. ఇప్పటికీ అసోంలో గల గువహటి రాడిసన్ బ్లూ హోటల్లో అసమ్మతి ఎమ్మెల్యేలు ఉన్నారు.

రౌత్ ఫైర్
అంతకుముందు షిండేపై రౌత్ ఫైరయ్యారు బీజేపీ ఉచ్చులో చిక్కుకున్నారని ఫైరయ్యారు. అందుకే ఇలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. మీకు అన్నీ ఇచ్చిన వారిపై ఇలా చేయడం ఏంటీ అని ఫైరయ్యారు. అంతేకాదు చాలా మంది ఎమ్మెల్యేలు తిరిగి రావాలని అనుకుంటున్నారని మరో ఎమ్మెల్యే కైలాస్ పాటిల్ అన్నారు. ఈయనను కూడా క్యాంప్నకు తీసుకెళ్లగా.. నితిన్తో కలిసి తప్పించుకుని ముంబై చేరుకున్న సంగతి తెలిసిందే.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications