సీఐడీ ఎస్సై అనుమానాస్పద మృతి.. హోటల్ గదిలో అచేతనంగా.. ఎక్కడ అంటే
పోలీసు శాఖలో గల నేర పరిశోధక విభాగంలో ఎస్సైగా పనిచేస్తున్న వ్యక్తి అనుమానాస్పదస్ధితిలో మరణించారు. మృతుడి ఒంటిపై ఎటువంటి గాయాలు లేకపోవడం మరిన్ని అనుమానాలు కలిగిస్తున్నాయి. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలో జరిగింది. అయితే చనిపోయిన వ్యక్తి సీఐడీ ఎస్సై కావడం విశేషం. దీంతో అతనిని శత్రువులే మట్టుబెట్టారా అనే అనుమానాలు వస్తున్నాయి.

ఎస్సై మృతి..
వైశాలి జిల్లా అరారా గ్రామానికి చెందిన సంజయ్ కుమార్ గోపాల్ గంజ్లోని సీఐడీలో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నాడు. సోమవారం ఉదయం 9-10 గంటల సమయంలో అతడి బంధువు నుంచి పోలీసులకు ఫోన్ వచ్చింది. ఆదివారం మధ్యాహ్నం నుంచి తన బావ ఫోన్ లిఫ్ట్ చేయటం లేదని అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

హోటల్లో బస
సంజయ్ కుమార్ ఏప్రిల్ 3న విధి నిర్వహణలో భాగంగా గోపాల్ గంజ్ జిల్లాలో గల ఒక హోటల్ లో బస చేస్తున్నాడు. ఆదివారం గోరఖ్ పూర్ వెళ్లాలని బయలు దేరి వెళ్లి ..తిరిగి రాత్రి 8-30 గంటలకు హోటల్ కు తిరిగి వచ్చేశాడు. సోమవారం కుమార్ తన హోటల్ గదినుంచి బయటకు రాలేదు. అదే సమయంలో కుమార్ భార్య ఫోన్ చేసినా సమాధానం రాక పోయేసరికి ఆమె హోటల్ సిబ్బందికి ఫోన్ చేసి చెప్పింది.

గదిలో మృతి
హోటల్ సిబ్బంది వెంటనే సంజయ్ కుమార్ బస చేసిన గదికి వచ్చి తలుపు కొట్టగా ఎటువంటి సమాధానం రాకపోవటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. హోటల్కు వచ్చిన పోలీసులు గది తలుపులు పగలగొట్టి చూడగా ఎస్సై అనుమానాస్పదస్ధితిలో మరణించి ఉన్నాడు. అతని రూం నుంచి మూడు ఖాళీ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.

సూసైడ్ నోట్ లభించలే
గదిలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గోపాల్ గంజ్ ఆస్పత్రికి తరలించారు. శరీరంపై ఎటువంటి గాయాలు లేవని... అధికంగా మద్యం సేవించినట్టు ప్రాధమికంగా గుర్తించామని ఎస్సై సురేంద్రకుమార్ తెలిపారు. ఫోరెన్సిక్ రిపోర్టు వచ్చాక మరణానికి కారణాలు తెలుస్తాయని తెలిపారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications