తప్పు చేయలే: బీజేపీతో పొత్తు సహజమే: ఏక్ నాథ్ షిండే
మహారాష్ట్రలో షిండే ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే. అయితే రెబల్ ఎమ్మెల్యేలు.. బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఎలాంటి తప్పు చేయలేదని షిండే అన్నారు. బీజేపీతో శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేయడం అనేది సహజ సిద్దం అని చెప్పారు. అలాగే తమ మంత్రివర్గంలోకి ఫడ్నవీస్ రావాలని ఎమ్మెల్యేలు కోరుకున్నారని ఆయన చెప్పారు. అందుకోసమే డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారని వివరించారు.
తమకు పూర్తి మెజార్టీ ఉందని షిండే అన్నారు. 170 మంది సభ్యుల మద్దతు ఉందని వివరించారు. బాల్ థాకరే ఆలోచనా విధానంతో ముందుకెళ్తామని చెప్పారు. ఇప్పటివరకు అధికారంలో ఉన్న పార్టీ.. ప్రతిపక్షంలోకి వెళ్లబోతుందని తెలిపారు. ఇదివరకు గల కూటమికి చెందిన ఎమ్మెల్యేలకు మహారాష్ట్ర అభివృద్ది.. వారి నియోజకవర్గం డెవలప్ జరుగుతుందని తెలిపారు.

తమ ప్రభుత్వంలో చేరనని ఫడ్నవీస్ ముందే చెప్పారని షిండే తెలిపారు. మహారాష్ట్ర అభివృద్ధిలో ఆయన పాలు పంచుకోవాలని అనుకున్నామని తెలిపారు. బీజేపీ హై కమాండ్ డిప్యూటీ సీఎం పదవీ చేపట్టాలని కోరిందని వివరించారు. దీంతో ఆయన పదవీ చేపట్టక తప్పలేదని చెప్పారు. ఆయన డిప్యూటీ సీఎంగా చేస్తానని చెప్పడం తమకు ఆనందంగా ఉందని తెలిపారు.
మహారాష్ట్రలో ఏక్ నాథ్ షిండే ప్రభుత్వం కొలువుదీరింది. మంత్రివర్గం ఏర్పాటు కాకపోయినా.. షిండే, ఫడ్నవీస్.. సీఎం, డిప్యూటీలుగా ప్రమాణం చేశారు. దీంతో శివసేన అధినేత ఉద్దవ్ థాకరే రగిలిపోతున్నారు. అందుకే షిండేపై చర్యలు తీసుకున్నారు. శివసేన పార్టీలో షిండే పదవులు అన్నింటిని తొలగించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటంతో ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. పార్టీ సభ్యత్వాన్ని కూడా వదులుకున్నారని.. అందుకోసమే చర్యలు తీసుకున్నామని తెలిపారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications