డిష్యూం డిష్యూం: సెక్యూరిటీ గార్డ్ వర్సెస్ ఫుడ్ డెలివరీ ఏజెంట్, ఎందుకంటే
ఇప్పుడు అంతా ఆన్ లైన్.. అవును ఫుడ్ డెలివరీ అంతా అందులో జరుగుతుంది. కానీ కొన్ని గేటెడ్ కమ్యూనిటీలో మాత్రం సెక్యూరిటీ ఉంటుంది. ఫుడ్ డెలివరీ అయితే కూడా పర్మిషన్ తీసుకోవాలి. అలా నోయిడాలో గల కొత్వాలీ ఏరియాలో గల సెక్టార్ 39 గార్డెనియా సొసైటీలో గొడవ జరిగింది.
అక్కడికి ఫుడ్ డెలివరీ బాయ్ వచ్చాడు. అయితే సెక్యూరిటీ గార్డు లోనికి పంపించలేదు. దీంతో వారి మధ్య గొడవ జరిగింది. ఆగ్రహానికి గురయిన డెలివరీ ఏజెంట్ సెక్యూరిటీ గార్డుపై దాడికి దిగాడు. చాలా సార్లు ఇద్దరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు కర్రలను తీసుకున్నారు. కర్రలతో కూడా దాడి చేసుకున్నారు.
విషయం తెలియడంతో పోలీసులు ఘటనా స్థలానికి వచ్చారు. డెలివరీ బాయ్ సాబీ సింగ్, సెక్యూరిటీ గార్డ్ రామ్ వినయ్ శర్మను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిద్దరిపై సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఆదివారం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. చిన్న విషయానికి కూడా ఇద్దరు గొడవకు దిగారు. కోపం ఆపుకోలేకపోవడంతో ఘర్షణ జరిగింది. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
@zomato delivery boy and security guard were fiercely assaulted over the entry in #Garden_Glory_Society of Noida.
— Satya Tiwari (@SatyatTiwari) October 9, 2022
The whole incident was caught in the #CCTV camera installed in the society, Noida Police Station Sector 39 area. pic.twitter.com/b0CVFTarXw