పాక్ ఉగ్రవాద స్థావరాలపై దాడి: ఎప్పుడు, ఎలా చేశారు?
న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్లో నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాద స్థావరాలపై తమ సైన్యం దాడి చేసిన విషయాన్ని భారత్ అకస్మాత్తుగా గురువారంనాడు ప్రకటించింది. ఈ దాడుల్లో దాదాపు 38 మంది ఉగ్రవాదులు మరణించినట్లు తెలుస్తోంది.
యురిలో పాకిస్తాన్ ఉగ్రవాదులు 18 మంది భారత సైనికులను హతమార్చిన ఘటన జరిగిన 11 రోజులకు భారత్ తన యుద్ధనీతిని ప్రదర్శించింది. యురి ఘటనను క్షమించబోమని భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా కూడా ప్రకటించారు. భారత సైన్యం ఉగ్రవాద స్థావరాలపై ఇలా దాడి చేసింది.

* వివిధ సెక్టార్లలోని 8 టెర్రరిస్టు లాంచ్ ప్యాడ్స్పై భారత సైన్యం గురి పెట్టింది.
* సరిహద్దు దాటి భారత సైనికులు పాకిస్తాన్లో 2-3 కిలోమీటర్ల దూరం వెళ్లారు.
* దాడులు బుధవారం అర్థరాత్రి ప్రారంభమై గురువారం తెల్లవారు జామున గం.4.30 నిమిషాలకు ముగిశాయి.
* జమ్మూ కాశ్మీర్లోనూ భారత దేశంలోని మెట్రో నగరాల్లోనూ దాడులు చేయడానికి సిద్ధపడిన ఉగ్రవాదులను, వారి గైడ్స్ను, హ్యాండిలర్స్ను భారత సైనికులు మట్టుబెట్టారు.
* భారత సైనికుల దాడిలో 38 మంది ఉగ్రవాదులతో పాటు ఇద్దరు పాకిస్తాన్ సైనికులు మరణించినట్లు తెలుస్తోంది.
* ఆపరేషన్లోకి వైమానిక బలగాలు మాత్రమే కాకుండా కాల్బలం కూడా దిగాయి.
అత్యంత వేగంగా నిర్దిష్టమైన స్థావరాలను గురి పెట్టి ఈ దాడులు జరిగాయి. పరిసరా ప్రాంతాలు విధ్వంసం కాకుండా పౌరులకు నష్టం వాటిల్లకుండా ఈ దాడులు జరిగాయి. యుద్ధవాతావరణం నెలకొందనే భావనను కలిగించకుండా ఈ దాడులు జరిగాయి.
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications