మీ నాయకత్వంలో సాంకేతికతలో విప్లవాత్మక మార్పులు: మోడీతో భేటీపై సుందర్ పిచాయ్
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో గూగుల్, అల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై మోడీతో చర్చించారు పిచాయ్. అన్ని వర్గాల వారికి ఇంటర్నెట్ అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నాలకు పూర్తి మద్దతు ఇస్తామని తెలిపారు.
గూగుల్ ఫర్ ఇండియా కార్యక్రమంలో పాల్గొనేందుకు భారత్ వచ్చిన పిచాయ్.. ఈ సందర్భంగా ప్రధానితో భేటీ అయ్యారు. అనంతరం ప్రధాని మోడీతో భేటీపై ట్విట్టర్ వేదికగా సుందర్ పిచాయ్ స్పందించారు. ప్రధానమంత్రి మోడీతో గొప్ప సమావేశం జరిగిందని.. అందుకు ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు పిచాయ్. జీ20కి భారత్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో పిచాయ్ అభినందనలు తెలిపారు.

మీ నాయకత్వంలో సాంకేతికంగా విప్లవాత్మక మార్పులు రావడంతో ఎంతో స్పూర్తిదాయకం. మా దృఢమైన భాగస్వామ్యాన్ని కొనసాగించడంతోపాటు భారత్ అధ్యక్షత వహిస్తోన్న జీ-20 సదస్సు నిర్వహణకు పూర్తి మద్దతు కోసం ఎదురుచూస్తున్నాం అని సుందర్ పిచాయ్ ప్రధాని మోడీతో భేటీపై వ్యాఖ్యానించారు. జీ-20 సదస్సు అధ్యక్షత బాధ్యతలు ఇటీవల భారత్ స్వీకరించిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది కాలంలో దేశ వ్యాప్తంగా సుమారు 200 సమావేశాలు నిర్వహించనుంది. సెప్టెంబర్ 2023లో జీ20 సదస్సు ఢిల్లీలో జరగనుంది.
Thank you for a great meeting today PM @narendramodi. Inspiring to see the rapid pace of technological change under your leadership. Look forward to continuing our strong partnership and supporting India's G20 presidency to advance an open, connected internet that works for all. pic.twitter.com/eEOHvGwbqO
— Sundar Pichai (@sundarpichai) December 19, 2022
కాగా, ప్రస్తుతం గూగుల్.. స్టార్టలప్లపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగానే గూగుల్ ఫర్ ఇండియా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. కేవలం స్టార్టప్ల కోసమే సుమారు 300 మిలియన్ డాలర్లను కేటాయించిన గూగుల్.. ఇందులో నాలుగో వంతును మహిళల నేతృత్వంలోని సంస్థల్లోనే పెట్టుబడి పెట్టనుంది.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications