Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Hijab Row: కాలేజ్ లు రీఓపెన్, ఎక్ట్స్రాలు చేస్తే ?, రంగంలోకి కేఎస్ఆర్పీ, విద్యార్థుల ఉత్సాహం !

బెంగళూరు: హిజాబ్, కాషాయం కండువాల వివాదం కారణంగా ఇన్ని రోజులు మూతపడిన కాలేజ్ లు బుధవారం మళ్లీ ప్రారంభం అయ్యాయి. హిజాబ్ వివాదానికి కేంద్ర బిందువు అయిన ఉడిపి జిల్లాలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బుధవారం ఉదయం నుంచి కాలేజ్ విద్యార్థులు ఉత్సాహంగా కాలేజ్ లకు బయలుదేరారు. కాలేజ్ ల దగ్గర కాలేజ్ విద్యార్థులు కాకుండా ఎవరైన గుమికూడితే కఠిన చర్యలు తీసుకోవడానికి పోలీసు అధికారులు సిద్దం అయ్యారు. ఉడిపి జిల్లాతో పాటు ఇప్పటికే కర్ణాటకలోని అన్ని జిల్లాల్లో కలెక్టర్లు, జిల్లా ఎస్పీల సమక్షంలో వివిద మత పెద్దలు, కుటుంబ సభ్యులతో శాంతిసభలు నిర్వహించి చర్చించారు.

హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు ఇచ్చిన మధ్యంతర తీర్పును ప్రతిఒక్కరూ పాటించాలని కలెక్టర్లు, జిల్లాల ఎస్పీలు విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులకు మనవి చేశారు.హైకోర్టు తీర్పును ఎవరైన ధిక్కరిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు హెచ్చరించారు. హిజాబ్ వివాదానికి కేంద్ర బింధువు అయిన ఉడిపి జిల్లాలో స్థానిక పోలీసులతో పాటు మహిళా పోలీసులు, కేఎస్ఆర్ పీ, సీఏఆర్ బలగాలను రంగంలోకి దింపారు. ఐటీ హబ్ బెంగళూరు నగరంలోని అన్ని కాలేజ్ లు, ఉర్దూ స్కూల్స్ దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

 హిజాబ్ గొడవకు బీజం ఇక్కడే

హిజాబ్ గొడవకు బీజం ఇక్కడే

హిజాబ్, కాషాయం కండువాల వివాదం కారణంగా ఇన్ని రోజులు మూతపడిన కాలేజ్ లు బుధవారం మళ్లీ ప్రారంభం అయ్యాయి. హిజాబ్ వివాదానికి కేంద్ర బిందువు అయిన ఉడిపి జిల్లాలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బుధవారం ఉదయం 6 గంటల నుంచి స్థానిక పోలీసులతో పాటు సాయుధ బలగాలు రంగంలోకి దిగాయి.

 ప్రతి కాలేజ్ లో శాంతిసభలు

ప్రతి కాలేజ్ లో శాంతిసభలు

ఉడిపి జిల్లా కలెక్టర్ కూర్మారావ్, జిల్లా ఎస్పీ విష్ణువర్దన్ తోపాటు వివిద మత పెద్దలు, కాలేజ్ విద్యార్థుల కుటుంబ సభ్యులు, స్థానిక నాయకులు, విద్యాశాఖా అధికారులతో శాంతి సభ నిర్వహించారు. హిజాబ్ వివాదం, కాషాయం కండువాల వివాదం ప్రస్తుతం కర్ణాటక హైకోర్టులో విచారణ జరుగుతోందని, తీర్పు వచ్చే వరకు అందరూ శాంతియుతంగా ఉండాలని ఉడిపి జిల్లా కలెక్టర్ కూర్మారావ్ కాలేజ్ విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు, మత పెద్దలు, స్థానిక నాయకులను మనవి చేశారు.

 హైకోర్టు ఆదేశాలకు కట్టుబడి ఉండాలి

హైకోర్టు ఆదేశాలకు కట్టుబడి ఉండాలి

ఉడిపి జిల్లాతో పాటు ఇప్పటికే కర్ణాటకలోని అన్ని జిల్లాల్లో కలెక్టర్లు, జిల్లా ఎస్పీల సమక్షంలో వివిద మత పెద్దలు, కుటుంబ సభ్యులతో శాంతిసభలు నిర్వహించి చర్చించారు. హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు ఇచ్చిన మధ్యంతర తీర్పును ప్రతిఒక్కరూ పాటించాలని కలెక్టర్లు, జిల్లాల ఎస్పీలు విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులకు మనవి చేశారు.

ఎవరైనా ఎక్ట్రాలు చేస్తే ?

ఎవరైనా ఎక్ట్రాలు చేస్తే ?

హైకోర్టు తీర్పును ఎవరైన ధిక్కరిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు హెచ్చరించారు. ఉడిపి జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని ఆ జిల్లా ఎస్పీ విష్ణువర్దన్ అన్నారు. హిజాబ్ వివాదానికి కేంద్ర బింధువు అయిన ఉడిపి జిల్లాలో స్థానిక పోలీసులతో పాటు మహిళా పోలీసులు, కేఎస్ఆర్ పీ, సీఏఆర్ బలగాలను రంగంలోకి దింపారు.

 ఉత్సాహంగా బయలుదేరిన విద్యార్థులు

ఉత్సాహంగా బయలుదేరిన విద్యార్థులు

బుధవారం ఉదయం నుంచి కాలేజ్ విద్యార్థులు ఉత్సాహంగా కాలేజ్ లకు బయలుదేరారు. వారం రోజుల క్రితం కర్ణాటకలో కాలేజ్ లు మూతపడ్డాయి. కాలేజ్ ల దగ్గర కాలేజ్ విద్యార్థులు కాకుండా ఎవరైన గుమికూడితే కఠిన చర్యలు తీసుకోవడానికి పోలీసు అధికారులు సిద్దం అయ్యారు. ఉడిపి జిల్లాలో 700 మందికి పైగా అదనపు పోలీసు బలగాలను రంగంలోకి దింపారు. ఐటీ హబ్ బెంగళూరు నగరంలోని అన్ని కాలేజ్ లు, ఉర్దూ స్కూల్స్ దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+