వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలాండ్‌కు పాకిన విద్వేషం: భారత విద్యార్థిపై దాడి, ఆస్పత్రిలో చేరిక

ప్రపంచ వ్యాప్తంగా జాతి విద్వేష దాడులు పెరిగిపోతున్నాయి. నిన్న మొన్నటి వరకు అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలకే పరిమితమైన ఈ దాడులు ఇతర దేశాలకు పాకుతున్నాయి.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/వర్సా: ప్రపంచ వ్యాప్తంగా జాతి విద్వేష దాడులు పెరిగిపోతున్నాయి. నిన్న మొన్నటి వరకు అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలకే పరిమితమైన ఈ దాడులు ఇతర దేశాలకు పాకుతున్నాయి. తాజాగా, పోలాండ్‌లో ఓ భారత విద్యార్థిపై దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పాంజన్‌ ప్రాంతంలోని ఓ ట్రామ్‌లో గత బుధవారం ఓ భారత విద్యార్థిపై గుర్తుతెలియని వ్యక్తి దాడి చేసి.. అక్కడి నుంచి పరారయ్యాడు. గాయపడిన ఆ విద్యార్థి తన స్నేహితుడికి ఫోన్‌ చేయడంతో అతడు వచ్చి ఆసుపత్రికి తీసుకెళ్లాడు.

Indian student beaten up in Poland

అయితే మళ్లీ తనపై దాడి జరుగుతుందన్న భయంతో బాధితుడు తన పేరును వెల్లడించేందుకు నిరాకరించాడు. పోలాండ్‌ మీడియా ద్వారా విషయం తెలుసుకున్న కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌.. ఘటనపై విచారం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలతో నివేదిక అందజేయాలని అక్కడ భారత రాయబారి అజయ్‌ బిసారియాను ఆదేశించారు.

'పొలాండ్‌లో విద్యార్థిపై దాడి జరిగింది. అదృష్టవశాత్తు ఆ వ్యక్తి పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నాం' అని సుష్మాస్వరాజ్‌ తన ట్వీట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.

English summary
An Indian student was beaten up on a tram in Poland in an apparent racist attack. The Indian government said it is enquiring into all aspects of the incident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X