గూఢచర్యానికి చెక్: 153 పావురాల పట్టివేత
న్యూఢిల్లీ: గూఢచర్యం కోసం అక్రమంగా తరలిస్తున్న 150కిపైగా పావురాలను జమ్మూ కాశ్మీర్ పోలీసులు పట్టుకున్నారు. అరటి పండ్ల బాక్సుల్లో వీటిని ఉంచి తరలిస్తుండగా విక్రమ్ చౌక్ వద్ద అక్టోబర్ 5న సీజ్ చేశారు. వీటిని గూఢచర్యం కోసమే అక్రమంగా రవాణా చేస్తున్నారని అధికారులు తెలిపారు.
153 పావురాలను తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేశారు. పోలీసులు ఆ పావురాలను ఓ ఎన్జీవో సంస్థకు అప్పగించారు.

పావురాలకు గూఢచర్య కోసం ఉపయోగించే అయస్కాంత రింగులు కాలుకు కట్టి ఉన్నాయని ఎన్జీవో నిర్వహకులు తెలిపారు. దీంతో అధికారులు విచారణకు ఆదేశించారు. పావురాలను ఇలా గూఢచర్యం కోసం ఉపయోగించడం ఇది కొత్తకాదు. గతంలో కూడా పాక్ పావురాలను గూఢచర్యం కోసం వాడుకుంది.
ఇటీవల రెక్కలపై ఉర్దూ అక్షరాలతో భారత ప్రధాని నరేంద్ర మోడీకి సందేశాన్ని ఇస్తూ సరిహద్దు సమీపంలోని బామియల్ ప్రాంతంలో సింబల్పోస్ట్ దగ్గర ఓ పావురం బీఎస్ఎఫ్ సిబ్బందికి చిక్కింది. మరో వైపు పంజాబ్లోని హోషియార్పూర్ జిల్లాలో గత సెప్టెంబర్ 23న రెక్కలపై ఉర్దూ అక్షరాలు రాసి ఉన్న ఓ తెల్లపావురం సరిహద్దును దాటి వచ్చిన విషయం తెలిసిందే.
-
వి ఆర్ రెడీ: పాకిస్థాన్ సంచలన ప్రకటన -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ!












Click it and Unblock the Notifications