జయలలితకు ఎన్నికల విక్టరీ!: స్టాలిన్కు షాక్, ఆశలపై నీళ్లు
చెన్నై: అక్రమాస్తుల కేసులో తమ పార్టీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి జయలలితకు హైకోర్టులో ఊరట లభించడంతో అన్నాడీఎంకే వర్గాలు ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు ఉత్సాహం చూపిస్తున్నాయి. అయితే, అంతిమ నిర్ణయం మాత్రమే జయలలిదేనని అంటున్నారు. ఇదిలా ఉండగా, జయలలితకు హైకోర్టులో ఊరట లభించడం డీఎంకే పార్టీకి పెద్ద షాక్ అని అంటున్నారు.
జయలలితను హైకోర్టులో నిర్దోషిగా తేల్చడం వల్ల అన్నాడీఎంకేకు ప్రజల్లో మరింత ప్రతిష్ట పెరుగుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ఇదే ఊపులో ముందస్తు ఎన్నికలకు వెళ్లడం మంచిదని భావిస్తున్నారు. అదే సమయంలో హైకోర్టు తీర్పు డీఎంకేకు షాక్.

ఆస్తుల కేసులో జయలలితను కోర్టు దోషిగా చెబితే అది అన్నాడీఎంకే పార్టీకి నష్టం జరిగి, తమకు బాగా లబ్ధి చేకూరేదని డీఎంకే వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పుడు రివర్స్ అయిందని భావిస్తున్నారు.
కర్నాటక హైకోర్టు తీర్పు డీఎంకేను షాక్కు గురిచేసింది. జయలలితకు హైకోర్టులో చుక్కెదురు అవుతుందనుకున్న డీఎంకే నేత స్టాలిన్ ఆశలపై నీళ్లు చల్లినట్లు అయింది. జయ అక్రమాస్తుల కేసును హైకోర్టు కొట్టిపారేయడంతో స్లాలిన్ బృందం గందరగోళంలో పడింది.
జయపై ఉన్న కేసులన్నీ రద్దు కావడంతో రానున్న ఎన్నికల్లో డీఎంకేకు గట్టి పోటీ అనివార్యంగా కనిపిస్తోంది. హైకోర్టు తీర్పు ఒకవిధంగా తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే విక్టరీకి సంకేతమని జయ అభిమానులు భావిస్తున్నారు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications