చెరువులోకి దూకి ఆరుగురి ప్రాణాలు కాపాడిన మంత్రి
బెంగళూరు: ఓ రాష్ట్ర మంత్రి చెరువులోకి దూకి ఆరుగురి ప్రాణాలు కాపాడిన సంఘటన కర్నాటక జిల్లాలో జరిగింది. మంగళవారం ఉదయం ప్రాథమిక, ఉన్నత విద్యా శాఖ మంత్రి కిమ్మనె రత్నాకర్ తన ఇన్నోవా కారులో తన సొంత ఊరైన తీర్థహల్లి నుండి బెంగళూరుకు వెళ్తున్నారు.
ఈ సమయంలో ఓ మారుతి స్విఫ్ట్ కారు మంత్రి కారును ఓవర్ టేక్ చేసి వెళ్లిపోయింది. మంత్రి కొద్ది దూరం వెళ్లాక తమను దాటుకుంటూ వెళ్లిన కారు బెగువల్లి చెరువులో మునిగిపోతూ కనిపించింది. కారులో ఆరుగురు కుటుంబ సభ్యులు చిక్కుకుపోయారు.

వెంటనే స్పందించిన మంత్రి రత్నాకర్ తన గన్మెన్, డ్రైవర్, ఎస్కార్టు వాహనం డ్రైవర్లతో కలిసి చెరువులోకి దూకారు. కారులో ఉన్న ఆరుగురు కుటుంబ సభ్యులను రక్షించారు.
డ్రైవర్ చంద్రశేఖర్ ఇతరులతో కలిసి నీళ్లలో మునిగిన కారు తలుపును తెరిచాడు. ముగ్గురు పిల్లలను బయటకు తీసుకు వచ్చాడు. ఆ తర్వాత మిగిలిన మరోసారి వెళ్లి మిగిలిన వారిని తీసుకు వచ్చాడు.
మంత్రి వెంటనే వైద్యుడికి ఫోన్ చేసి పిలిపించారు. వారికి పరీక్షల అనంతరం మందులు, ఫలహారం అన్నింటిని మంత్రి ఏర్పాటు చేశాడు. కాగా, స్టీరింగ్ లాక్ కావడంతో కారు చెరువులోకి వెళ్లిందని వారు చెబుతున్నారు.
-
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..!












Click it and Unblock the Notifications