వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అవమానాలూ భరించారు: తలవంచలేదని వెంకయ్యపై మోడీ ప్రశంసలు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: వస్తు,సేవల పన్ను(జీఎస్టీ) రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదానికి కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, అరుణ్ జైట్లీలు రెండేళ్లుగా ఎంతగానో కృషి చేశారంటూ ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసల వర్షం కురిపించారు. మంగళవారం జరిగిన భారతీయ జనతా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో జీఎస్టీ బిల్లుపై ఆయన ప్రసంగించారు.

ఈ బిల్లుకోసం పార్టీలో అంతా తమవంతు పాటుపడ్డారని అన్నారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా వెంకయ్యనాయుడు ఉన్నప్పుడు జీఎస్టీ బిల్లుకోసం ఎంతగానో శ్రమించారని ఆయన గుర్తు చేశారు.

Modi praises Venkaiah for GST bill

వెంకయ్య కృషికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేయాలని అనుకుంటున్నానని, ఆయన తన రాజకీయ జీవితంలో ఎవరి ముందు తలవంచలేదని అన్నారు. జీఎస్టీకోసం వివిధ రాజకీయ పార్టీలతో వెంకయ్య జరిపిన సంప్రదింపులు, నిరంతర చర్చలు అభినందనీయమని అన్నారు.

ఆయా రాజకీయపార్టీల నేతలతో చర్చల సందర్భంగా ఒక్కోసారి ఎన్నో అవమానాలు కూడా ఎదురవుతాయని, వాటన్నింటినీ వెంకయ్య చాలా ఓర్పుతో భరించారని అన్నారు. జీఎస్టీ రాజ్యాంగ సవరణ చరిత్రాత్మకమైందని, సత్వరం దేశ ఆర్థికాభివృద్ధికి ఎంతో దోహదం చేస్తుందని ప్రధాని అన్నారు.
అంతేగాక, బిజెపి ఎంపీలు తాము సాధించిన పురోగతిపై నివేదిక అందించాలని మోడీ ఈ సందర్భంగా కోరారు. తిరంగ యాత్ర (ఆగస్టు 15 నుంచి22 వరకు) కార్యక్రమాన్ని అన్ని వర్గాలను కలుపుకుని విజయవంతంగా నిర్వహించాలని మోడీ సూచించినట్లు కేంద్రమంత్రి అనంతకుమార్ తెలిపారు.

English summary
Prime Minister Narendra MOdi heaped praise on Finance Minister Arun Jaitley and Information and Broadcasting Minister M Venkaiah Naidu for their efforts in bringing different political parties around to supporting the bill.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X