అవమానాలూ భరించారు: తలవంచలేదని వెంకయ్యపై మోడీ ప్రశంసలు
న్యూఢిల్లీ: వస్తు,సేవల పన్ను(జీఎస్టీ) రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదానికి కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, అరుణ్ జైట్లీలు రెండేళ్లుగా ఎంతగానో కృషి చేశారంటూ ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసల వర్షం కురిపించారు. మంగళవారం జరిగిన భారతీయ జనతా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో జీఎస్టీ బిల్లుపై ఆయన ప్రసంగించారు.
ఈ బిల్లుకోసం పార్టీలో అంతా తమవంతు పాటుపడ్డారని అన్నారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా వెంకయ్యనాయుడు ఉన్నప్పుడు జీఎస్టీ బిల్లుకోసం ఎంతగానో శ్రమించారని ఆయన గుర్తు చేశారు.

వెంకయ్య కృషికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేయాలని అనుకుంటున్నానని, ఆయన తన రాజకీయ జీవితంలో ఎవరి ముందు తలవంచలేదని అన్నారు. జీఎస్టీకోసం వివిధ రాజకీయ పార్టీలతో వెంకయ్య జరిపిన సంప్రదింపులు, నిరంతర చర్చలు అభినందనీయమని అన్నారు.
ఆయా రాజకీయపార్టీల నేతలతో చర్చల సందర్భంగా ఒక్కోసారి ఎన్నో అవమానాలు కూడా ఎదురవుతాయని, వాటన్నింటినీ వెంకయ్య చాలా ఓర్పుతో భరించారని అన్నారు. జీఎస్టీ రాజ్యాంగ సవరణ చరిత్రాత్మకమైందని, సత్వరం దేశ ఆర్థికాభివృద్ధికి ఎంతో దోహదం చేస్తుందని ప్రధాని అన్నారు.
అంతేగాక, బిజెపి ఎంపీలు తాము సాధించిన పురోగతిపై నివేదిక అందించాలని మోడీ ఈ సందర్భంగా కోరారు. తిరంగ యాత్ర (ఆగస్టు 15 నుంచి22 వరకు) కార్యక్రమాన్ని అన్ని వర్గాలను కలుపుకుని విజయవంతంగా నిర్వహించాలని మోడీ సూచించినట్లు కేంద్రమంత్రి అనంతకుమార్ తెలిపారు.
-
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !!












Click it and Unblock the Notifications