కలకలం: ముంబై విమానాశ్రయానికి ఐసిస్ బెదిరింపు, కార్గో విమానంలో హెచ్చరిక లేఖ
ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద విధ్వంసానికి పాల్పడతామంటూ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ఐసిస్ హెచ్చరించింది. దీనికి సంబంధించి ఓ లేఖ నిఘా వర్గాలకు అందింది.
న్యూఢిల్లీ : ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద విధ్వంసానికి పాల్పడతామంటూ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ఐసిస్ హెచ్చరించింది. దీనికి సంబంధించి ఓ లేఖ నిఘా వర్గాలకు అందింది.
ఈ సమాచారాన్ని అందుకున్న వెంటనే భద్రతాధికారులు అప్రమత్తమై రంగంలోకి దిగారు. విమానాశ్రయంలోపల, బయట పరిసరాల్లో అణువణువూ గాలించారు. బాంబు నిర్వీర్య దళం, సీఐఎస్ఎఫ్ సిబ్బంది, ఇతర భద్రతా సంస్థల సిబ్బంది తనిఖీలు చేశారు.

ముంబై విమానాశ్రయ అధికారులు విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఓ టాయ్లెట్లో ఓ నోట్ కనిపించింది. 2018 జనవరి 26న కార్గోపై ఐసిస్ ఉగ్రవాద సంస్థ దాడి జరుపుతుందని ఆ లేఖలో ఓ హెచ్చరిక ఉంది.
ఈ నేపథ్యంలో కార్గోను ఖాళీ చేయించామని, స్క్రీనింగ్ తర్వాతే ప్రయాణికులను లోపలికి అనుమతిస్తున్నామని భద్రతాధికారులు తెలిపారు. ప్రయాణికుల లగేజిని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు.
More From
-
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్ -
కక్ష్యను మార్చకోనున్న బుధుడు.. ఈ రాశుల జీవితం మారిపోతోంది -
అతడు ఇప్పుడు పక్కా మెంటల్లీ టఫ్: రవిశాస్త్రి -
సిగ్గుండాలి.. అనసూయ ఒక్క పోస్ట్తో సైలెన్స్! -
భారత్ కు డొనాల్డ్ ట్రంప్ గుడ్ న్యూస్.. -
ఫైనల్ వేళ టీమిండియాకు మాజీ కోచ్ హెచ్చరిక, అభిషేక్ బ్యాటింగ్ ఆర్డర్ ఇక..!! -
మీ పాత బంగారం చెల్లుతుందా? 2026 కొత్త నిబంధనలు ఇవే! -
EPF 2026 అమల్లోకి: డబ్బులు ఎన్నిసార్లు తీసుకోవచ్చో తెలుసా? -
T20 world cup Final: ఫైనల్ అభిషేక్ దే-తేల్చేసిన టీమిండియా హీరో..! -
ఇరాన్ పోరాటం వెనుక రహస్య ఆయుధం? యూఎస్-ఇజ్రాయెల్ కు చిక్కని సీక్రెట్..! -
జీహెచ్ఎంసీ వాసులకు బిగ్ న్యూస్.. వారి ఆస్తులు సీజ్ కు రంగం సిద్ధం! -
ఆ ఉద్యోగుల జీతాలు నిలిపివేత, ఐఏఎస్ ల నుంచి జిల్లా స్థాయి వరకు - నిర్ణయం వెనుక..!!












Click it and Unblock the Notifications