బద్రీనాథ్లో కూలిన హెలికాప్టర్: ఇంజినీర్ మృతి, క్షేమంగా పైలట్లు, ప్రయాణికులు
ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్లో శనివారం ఉదయం హెలికాప్టర్ ప్రమాదం చోటు చేసుకుంది. బద్రీనాథ్ నుంచి హరిద్వార్కు భక్తులను తీసుకొని వెళ్తూ కుప్పకూలిపోయింది.
బద్రీనాథ్: ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్లో శనివారం ఉదయం హెలికాప్టర్ ప్రమాదం చోటు చేసుకుంది. బద్రీనాథ్ నుంచి హరిద్వార్కు భక్తులను తీసుకొని వెళ్తూ టేకాఫ్ సమయంలో కుప్పకూలిపోయింది. ఎనిమిది మందితో వెళ్తున అగస్టా 119 హెలికాప్టర్ ప్రమాదానికి గురికావడంతో ఒకరు మృతి చెందారు.
ఈ హెలికాప్టర్లో మొత్తం ఐదుగురు ప్రయాణికులు, ఇద్దరు పైలెట్లు, ఒక ఇంజినీరు ఉన్నారు. ప్రమాదంలో ఇంజినీరు ప్రాణాలు కోల్పోగా.. పైలెట్లు స్వల్పంగా గాయపడ్డారు. కాగా, ప్రయాణికులు క్షేమంగానే ఉన్నారని డీజీసీఏ అధికారులు తెలిపారు.

ప్రమాదాన్ని పరిశీలించేందుకు విచారణ బృందం ఘటనా స్థలానికి చేరుకుంది.
ఈ ప్రమాదంలో మృతి చెందిన ఇంజినీరు కుటుంబానికి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ సంతాపాన్ని తెలియజేశారు. హెలికాప్టర్ ప్రమాదం తీవ్ర దిగ్భాంత్రికి గురి చేసిందని ఆయన పేర్కొన్నారు.
More From
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications