వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోదీ అనూహ్యం:పొలిటిక్ అఫైర్స్ ప్యానెల్‌లోకి స్కృతి ఇరానీ -కేబినెట్ కమిటీల్లో ప్రధాని మార్కు మార్పులు

|
Google Oneindia TeluguNews

ఉత్తరప్రదేశ్ లో ఇప్పటికే బలహీనపడిన కాంగ్రెస్ పార్టీని దాదాపు చావుదెబ్బ కొట్టి, ఆ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీనే ఓడించిన స్మృతి ఇరానీ ఇప్పటికే కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు. కాగా, ఇంకొద్ది నెలల్లోనే యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండగా, ఇరానీకి అధిక ప్రధాన్యం కల్పిస్తూ, అనూహ్య రీతిలో ఆమెను కేంద్ర కేబినెట్ పొలిటికల్ వ్యవహారాల కమిటీలోకి తీసుకున్నారు.

కౌశిక్.. నువ్వో శ్రీరెడ్డివి -సీఎంతో 5 గం -టీపీసీసీగా రేవంత్ రెడ్డి తొలి విజయం -కాంగ్రెస్ టికెట్ పొన్నంకే!కౌశిక్.. నువ్వో శ్రీరెడ్డివి -సీఎంతో 5 గం -టీపీసీసీగా రేవంత్ రెడ్డి తొలి విజయం -కాంగ్రెస్ టికెట్ పొన్నంకే!

కేంద్ర మంత్రివర్గ విస్తరణ పూర్తయిన వారం రోజులకు కేబినెట్‌ కమిటీలను సైతం పునర్వ్యవస్థీకరించారు ప్రధాని నరేంద్ర మోదీ. కొత్త, పాత మంత్రులతో మార్పులు చేసిన కేబినెట్ కమిటీల వివరాలు మంగళవారం వెలువడ్డాయి. ప్రధాని మోదీ నేతృత్వం వహిస్తోన్న, అత్యంత ప్రాధాన్యం ఉండే రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీలోకి కొత్తగా స్మృతి ఇరానీ, భూపేంద్ర యాదవ్‌, వీరేంద్రకుమార్‌, గిరిరాజ్‌సింగ్‌, అర్జున్‌ ముండా, శర్వానంద సోనోవాల్‌, మన్‌సుఖ్‌ మాండవీయకు చోటు కల్పించారు.

 PM Modi makes changes in Cabinet Committees; Smriti Irani, Sonowal in political affairs panel

రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నేతృత్వంలోని పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీలోకి అనురాగ్‌ ఠాకూర్‌, కిరణ్‌ రిజిజు, వీరేంద్ర కుమార్‌లను తీసుకున్నారు. పదవులు కోల్పోయిన రవిశంకర్‌ ప్రసాద్‌, ప్రకాశ్‌ జావదేకర్‌ స్థానంలో అనురాగ్‌, కిరణ్‌ లకు చోటు కల్పించారు. నైపుణ్య వ్యవహారాల కేబినెట్ కమిటీలోకి ఆర్సీపీ సింగ్‌, అశ్వనీ చౌబే, భూపేంద్రయాదవ్‌, కిషన్‌రెడ్డిలను ప్రధాని మోదీ నియమించారు. మార్పులు చోటచేసుకున్న అన్ని కమిటీల్లోనూ భూపేంద్ర యాదవ్ కు చోటు దక్కడం విశేషం. ఇక,

షాకింగ్: భారత్‌లో కొవిడ్ 3వ వేవ్ -జులై 4నే మొదలైంది: హైదరాబాద్ ఫిజిసిస్ట్ -461రోజుల డేటాతోషాకింగ్: భారత్‌లో కొవిడ్ 3వ వేవ్ -జులై 4నే మొదలైంది: హైదరాబాద్ ఫిజిసిస్ట్ -461రోజుల డేటాతో

దేశ భద్రతకు సంబంధించి అత్యున్నత నిర్ణాయక వ్యవస్థ-భద్రతా వ్యవహారాల కేబినెట్‌ కమిటీలో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. ఈ కమిటీలో ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, హోంమత్రి అమిత్‌ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, విదేశాంగ మంత్రి జైశంకర్ సుబ్రహ్మణియన్‌ కొనసాగుతున్నారు. అలాగే మోదీ, షాలతో కూడిన నియమకాల కమిటీలోనూ ఎలాంటి మార్పు చేయలేదు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన జ్యోతిరాధిత్య సింధియా, అశ్వినీ వైష్ణవ్‌, నారాయణ్‌ రాణెకు పెట్టుబడులు-వృద్ధికి సంబంధించిన కేబినెట్‌ కమిటీలో చోటు దక్కింది.

English summary
Weeks after the Union Cabinet reshuffle, the government has now made changes in the Cabinet Committees with Smriti Irani, Sarbananda Sonowal being included in the committee on political affairs. Minister for Women and Child Development, Smriti Irani, Environment and Labour Minister Bhupender Yadav and Ports Minister Sarbananda Sonowal are now in the Cabinet Committee on Political Affairs, which is headed by PM Narendra Modi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X