బిజెపిని ధనుమాడి అలసిన ఏఏపీ ఎంపీ, నీళ్లిచ్చిన మోడీ
న్యూఢిల్లీ: లోకసభలో బుధవారం నాడు ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ముఖ్య కార్యదర్శి రాజేంద్ర కుమార్ కార్యాలయంలో, నివాసంలో సిబిఐ సోదాల పైన ఏఏపీ మండిపడుతోంది. దీనిని బిజెపి నేతలు, కేంద్రం తిప్పికొడుతోంది.
ఢిల్లీలో ప్రధాన కార్యదర్శి రాజేంద్ర కుమార్ కార్యాలయంలో, ఆఫీసులో సీబీఐ సోదాల పైన ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు భగవంత్ మన్ లోకసభలో నిరసన తెలిపారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అతను పెద్ద ఎత్తున బిజెపికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అదే సమయంలో అతని గొంతు ఎండిపోయింది. కాస్త ఇబ్బంది పడ్డాడు. పక్కనే ఏమైనా మంచి నీళ్లు ఉన్నాయా అని వెతికాడు. లోకసభ సచివాలయ సిబ్బంది టేబుల్ పైన కూడా మంచి నీళ్ల కోసం చూశాడు.

అతడు మంచి నీళ్ల కోసం ఆరాటపడుతుండటాన్ని గమనించిన ప్రధాని నరేంద్ర మోడీ... నవ్వుతూ తన టేబుల్ పైన ఉన్న మంచి నీళ్లు గ్లాస్ అందించారు. ఆ సమయంలో ప్రధాని మోడీ, ఏఏపీ ఎంపీ భగవంత్ మన్లు పరస్పరం నవ్వేశారు.
సదరు ఏఏపీ ఎంపీ మంచినీళ్లు తాగి ఆ గ్లాస్ను తిరిగి ప్రధాని మోడీ టేబుల్ పైన పెట్టారు. ప్రధాని దాని పైన కవర్ ఉంచారు. ఈ సమయంలో పలువురు బిజెపి ఎంపీలు... ప్రధాని మోడీ చేసిన పనిని అభినందిస్తున్నట్లుగా విక్టరీ సింబల్ చూపించారు. అయితే, భగవంత్ మన్ ఆ తర్వాత తన నినాదాలు కొనసాగించారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications