బరితెగించిన పాక్ మార్చిలో 100సార్లు కాల్పుల విరమణ ఉల్లంఘన

శ్రీనగర్ : పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. భారత భద్రతా బలగాలపై కాల్పులకు తెగబడింది. పూంచ్ సెక్టార్ లోని షాపూర్ ఏరియాలో జరిగిన ఈ ఘటనలో హరి వాకర్ అనే జవాన్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆర్మీ హాస్పిటల్ కు తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. ఒక్క వారంలో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోసారి. గురువారం సైతం సుందర్‌బనీ సెక్టార్‌లో పాక్ జరిపిన కాల్పుల్లో యశ్ పాల్ అనే జవాన్ అమరుడయ్యాడు. తాజాగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని తుంగలో తొక్కిన పాక్ ఆదివారం ఉదయం వరకు కాల్పులు కొనసాగించింది.

మార్చ్‌లో 100 సార్లు ఒప్పంద ఉల్లంఘన

Soldier Killed In Ceasefire Violation In J&K, Second In A Week
అంతర్జాతీయ సమాజం నుంచి ఎన్ని విమర్శలు ఎదురవుతున్నా పాకిస్థాన్ మాత్రం తన బుద్ధి మార్చుకోవడం లేదు. మార్చి నెలలో ఇప్పటి వరకు పాక్ 100సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. బాలాకోట్‌లో జైషే మహ్మద్ ఉగ్రవాద క్యాంపుపై భారత్ ఎయిర్ స్ట్రైక్స్ చేసిన అనంతరం పాక్ మరింత బరి తెగించింది. 2018లోనూ పాకిస్థాన్ సరిహద్దుల్లో 2,936సార్లు కాల్పులకు తెగబడింది. 2003వ సంవత్సరంలో భారత్ - పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అయినా దాన్ని లెక్కచేయని పాక్ నిబంధనలు తుంగలో తొక్కుతూ ఉల్లంఘనలకు పాల్పడుతోంది. ఇరు దేశాల దౌత్యాధికారుల భేటీలో భారత్ ఈ అంశాన్ని పలుమార్లు ప్రస్తావించినా పాకిస్థాన్ మాత్రం పట్టించుకోవడంలేదు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+